రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా నటించిన చిత్రం ''వరల్డ్ ఫేమస్ లవర్''. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమాను సీనియర్ నిర్మాత కే ఎస్ రామారావు నిర్మించారు.                      

 

ఇక అలాంటి ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఫస్ట్ ఆఫ్ అంత అద్భుతంగా తెరకెక్కినప్పటికీ సెకండ్ ఆఫ్ అంత స్లోగా నడుస్తుంది. ఇంకా అసలు ఈ సినిమా స్టోరీ లైన్ ఎం తీసుకున్నారు? ప్రేక్షకులకు ఏలాంటి సలహా ఇవ్వాలి అనుకుంటున్నారు? నలుగురు హీరోయిన్లు ఉంటె సినిమా హిట్ అయిపోతుందా? అనే టాక్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా.

 

విజ‌య్ దేవరకొండ సినిమా కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు హీరోయిన్లను తీసుకున్నారు. అల తీసుకొని నాలుగు ట్రాక్స్ నడిపారు. అందులో రెండు ట్రాక్స్ సినిమాలో ఎంతమాత్రం అద్భుతంగా లేవు. దీంతో తాను చెప్పదలచుకున్న జీవిత సూత్రం మిస్ ఫైర్ అయ్యింది ఇక్కడే.

 

ఇంకా అందరూ అనుకున్నట్టే ఫస్ట్ ఆఫ్ అదిరిపోతే సెకండ్ ఆఫ్ నెమ్మదిగా సాగింది. పైన అనుకున్నట్టు నలుగురు హీరోయిన్లు ఉంటె సినిమా హిట్ అవుతుంది అనుకోని సినిమా తీసినట్టు ఉంది. ఏది ఏమైనా రౌడీ సినిమా ఈసారి ప్రేక్షకులను అంత ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. ఎందుకంటే సినిమా కథనం చాలా స్లోగా నడుస్తుంది. ఇవి అన్ని ఈ సినిమాకు పెద్ద మైనస్ గా మారాయి. ఏది ఏమైతేనేం.. ఇంకా లవ్ సినిమాలలో దేవరకొండ నటించాడట.. విజయదేవర్ కొండాలో కొత్తకోణం చూపిస్తారంట.. మరి నెక్స్ట్ సినిమా ఎంతమాత్రం ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: