ప్రస్తుతం టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న భామ పూజా హెగ్డే. స్టార్ హీరోలు అందరిని కవర్ చేస్తూ స్లో గా వచ్చిన అవకాశాలను రెండు చేతులతో అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది ఆ భామ. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు సహా పలువురు హీరోలతో సినిమాలు చేసి హిట్ కొట్టింది.

 

ఇక మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అయితే పూజా హెగ్డే లక్కీ హీరోయిన్ గా మారింది. ఆమె కోసం త్రివిక్రమ్ ఒక కథ కూడా సిద్దం చేసుకుని సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని, జూనియర్ ఎన్టీఆర్ సరసన చేసే సినిమాలో ఆమెకు మరోసారి అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. 

 

ఇటీవల వచ్చిన అల వైకుంఠపురములో సినిమా మంచి విజయం సాధించింది. ఆమెతో త్రివిక్రమ్ చేసిన అరవింద సమేత కూడా హిట్ అయింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామ గురించి ఒక వార్త అల్చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా చూస్తే, ఆమె ఒక స్టార్ క్రికెటర్ తో ప్రేమలో ఉందని సమాచారం. కర్నాటకకు చెందిన ఒక యువ క్రికెటర్ తో ఆమె ప్రేమాయణం నడుపుతుందని టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. పూజ అతని కోసం ఇటీవల తన షూటింగ్ ని కూడా వాయిదా వేసుకున్నట్టు సమాచారం. 

 

ఈ విషయం ఆమె ఇంట్లో కూడా తెలుసు అని అంటున్నారు. అతని పుట్టిన రోజు వేడుకులను కూడా గ్రాండ్ గా చేసింది. ఇటీవల విదేశీ పర్యటన నుంచి వచ్చిన సదరు క్రికెటర్ కోసం ఎయిర్పోర్ట్ కి కారు కూడా ఆమె పంపించింది అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఇటీవల ఆమె బెంగళూరు అతని కోసం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడే కెరీర్ లో నిలబడుతున్న పూజ మరి పెళ్లి చేసుకుంటుందో లేక సినిమాలు చేస్తుందో లేక అతనితో కలిసి విదేశీ టూర్లకు వెళ్తూ అతని మ్యాచులు చూస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: