యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పి.ఆర్ గా పనిచేస్తున్న mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు ఇప్పుడు సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు చేస్తున్నాడు. ఈస్ట్ కోస్ట్ మూవీస్ బ్యానర్ మొదలుపెట్టిన మహేష్ కోనేరు సినిమాలు చేస్తున్నాడు. మొదటి సినిమానే నందమూరి కళ్యాణ్ రాం హీరోగా 118 సినిమాను నిర్మించిన మహేష్ కోనేరు ఆ సినిమాతో సక్సెస్ అందుకోగా తన సెకండ్ మూవీని నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ తో మిస్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత యువ హీరో నాగ శౌర్యతో సినిమా లైన్ లో పెట్టాడట మహేష్.

 

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ నంబర్ 4లో నాగ శౌర్య హీరోగా సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు నూతన దర్శకుడు రాజా ఇందస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. 118 తరహాలోనే ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకు కథ అందించిన రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేయడం విశేషం. మాములుగా ఎన్.టి.ఆర్, నాగార్జున అంటే పడిచచ్చే నాగ శౌర్య తన అభిమాన నటుడు ఎన్.టి.ఆర్ మేనేజర్ నిర్మాణంలో సినిమా చేయడం గొప్ప విషయం.

 

రీసెంట్ గా అశ్వద్ధామ సినిమాతో పెద్దగా ప్రేక్షకులను మెప్పించని నాగ శౌర్య ఈమధ్యనే ఓ సినిమా మొదలుపెట్టాడు. ఆ సినిమాలో నాగ శౌర్య సరసన రీతు వర్మ నటిస్తుంది. ఈ మూవీ పూర్తయ్యాక కాని తర్వాత సినిమా ఎప్పుడు మొదలవుతుంది అని చెప్పడం కష్టం. mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు కూడా కీర్తి సురేష్ మిస్ ఇండియా సినిమా రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు. తెలుగుతో పాటుగా తమిళ, మళయాళ భాషల్లో కూడా ఆ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. నాగ శౌర్యకు మాత్రం ఇది మంచి లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.    

మరింత సమాచారం తెలుసుకోండి: