టాలివుడ్ స్టార్ దర్శకుల్లో రాజమౌళి రేంజ్ వేరు. సినిమా సినిమాకు కూడా తాను ఎక్కడా తగ్గకుండా ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. ఆయన చేసే సినిమాలతో పాటుగా కొన్ని నిర్ణయాలు కూడా ఆశ్చర్యంగానే ఉంటాయి. భారీ బడ్జెట్ సినిమాలను పెద్ద స్టార్ హీరోలతో తీస్తూ రాజమౌళి కనపడని దూకుడు ప్రదర్శిస్తూ ఉంటాడు అనేది అందరికి తెలిసిన విషయమే. ప్రభాస్, రానా తో బాహుబలి సినిమా తీసి ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే కాకుండా తెలుగు సినిమా సత్తాను ఘనంగా చాటాడు. బాహుబలి 1 బాహుబలి 2 ఆ రెండు సినిమాలు సాధించిన వసూళ్ళ దెబ్బకు ఇండియన్ సినిమా షేక్ అయింది. 

 

ఇక ఇప్పుడు రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సరసన ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుత౦ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల అవుతుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇదిలా ఉంటే ఆ సినిమా అవ్వకుండానే మరో సినిమాను రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడని టాలివుడ్ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాల మీద దృష్టి పెడుతున్నాడు కాబట్టి మరో అలాంటి ప్రయోగమే చేస్తున్నాడు. 

 

టాలివుడ్ స్టార్ హీరోలుగా ఉన్న మహేష్ బాబు, ప్రభాస్ తో కలిసి ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఇప్పటికే ఈ విషయాన్ని ఆ ఇద్దరు హీరోలకు చెప్పినట్టు అని  సమాచారం. 2021 మే నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని టాక్ వినపడుతుంది. నిజానికి మహేశ్‌బాబుతో రాజమౌళి సినిమా చేయాల్సి ఉందనే వార్తలు ఎప్పుటి నుంచో వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమాను చెయ్యాలని భావిస్తున్నట్టు అని తెలుస్తుంది. కె.ఎల్.నారాయణ ఆ చిత్రాన్ని నిర్మించనున్నాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: