జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు తెలుగు సినీ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ యొక్క ప్రేమ, పెళ్లి మరియు విడాకుల వ్యవహారం అందరికీ తెలిసిందే వారిద్దరికీ విడాకులు అయిపోయిన తర్వాత రేణు దేశాయ్ ప్రతి కదలిక పై మీడియా దృష్టి పెడుతూ ఉంది ఆమె చిన్న పని చేసినా కూడా దానిని పవన్ కు లింక్ చేస్తూ ఏదోరకంగా పుకారు పుట్టిస్తూనే ఉన్నారు. ఇదే విషయమై ఆమె కూడా చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే విడాకుల సమయంలో ఆమె భారీగా భరణం తీసుకుంది అన్న ప్రచారం కూడా బాగానే జరిగింది.

 

అయితే ప్రస్తుతం తాజాగా హైదరాబాదులో రేణు ఒక ఫ్లాట్ కొనుగోలు చేయగా దాన్ని వక్రీకరించి కొంత మంది పుకార్లు పుట్టించడంతో రేణు దేశాయ్ చాలా ఎమోషనల్ అయింది. రేణు దేశాయ్ కు చెందిన ఫ్లాట్ పవన్ కళ్యాణ్ 5 కోట్లు పెట్టి కొనిచ్చాడని కొన్ని మీడియా సంస్థలలో వస్తున్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించింది. ఫ్లాట్ తన స్వర్జితం కొనుగోలు చేసిందని మరియు తన ఆత్మ గౌరవానికి కొంచెం విలువ ఇవ్వాలని విజ్ఞప్తి చేసుకుంది.

 

ఇంకా రేణు దేశాయ్... నిన్నటి నుండి నాకు కాల్స్ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. నా నిజమైన ఆస్తి నా ఆత్మగౌరవం నా నిజాయితీ నా అస్థిత్వం. దాన్ని కాపాడుకునేందుకు నేను చాలా కష్టపడుతున్నాను. నేను ఇప్పటి వరకు నా తండ్రి నుండి కూడా ఎలాంటి ఆర్థిక సాయంను పొందలేదు. నేను హైదరాబాద్ లో కొనుగోలు చేసిన ప్లాట్ పూర్తిగా నా స్వర్జితం. వార్తలతో నా మాజీ భర్తకు సంబంధం ఉందని నేను అనుకోవడం లేదు. అసలు విషయం గురించి ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు అని చెప్పింది.

 

 

అంతేకాకుండా తన మాజీ భర్త నుండి తాను ఎటువంటి ఆర్థిక సహాయం కూడా పొందలేదని మరియు జీవితంలో మగాడికి సహాయం లేకుండా స్వతంత్ర భావాలున్న మహిళగా తాను ముందుకుపోతుండగా ఇలాంటి ప్రచారాలతో తను బలహీనపరిచవద్దంటూ రేణు ఎమోషనల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: