కోలీవుడ్ లో ప్రస్తుతం నయనతార టాప్ హీరోయిన్ అనే సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోయిన్లకు చుక్కలు చూపిస్తుంది. వేరే ఎవరికి అవకాశాలు రాకుండా తానే కొందరు దర్శకులను టార్గెట్ చేసి సినిమాలు చేస్తుంది నయన్. పెళ్లి వయసు దాటి చాన్నాళ్ళు అయినా సరే ఈమె మాత్రం పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన చేయడం లేదు. ఇక సమంతా విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో ఈమె దూకుడుగా సినిమాలు చేస్తుంది. పెళ్లి అయిన తర్వాత భర్త సహకారంతో సినిమాలు చేస్తుంది ఈ భామ. 

 

వరుసగా విజయాలు సాధిస్తూ ఎవరికి అందని రేంజ్ లో దూకుపోతుంది ఈ భామ. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇప్పుడు నయనతార, సమంత మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు పలువురు. అది నిజమనుకుంటున్నారా...? కాదు. ఒక సినిమాలో... వీరు ఇద్దరూ ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కోసం గొడవ పడుతున్నారు. నయనతార ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం, ‘కాత్తువక్కుల రెందు కాదల్‌’. మొదటి సారి తమ కెరీర్ లో సమంత, నయనతార ఈ సినిమాలో హీరోయిన్లు గా కలిసి నటిస్తున్నారు. 

 

ముక్కోణపు ప్రేమకథగా ఈ సినిమా వస్తుంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘కాత్తువక్కుల రెందు కాదల్‌’ సినిమాకు సంబంధించిన స్పెషల్‌ వీడియోని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఇద్దరి హీరోయిన్లకు ఫ్యాన్ బేస్ ఇటు తెలుగులో, అటు తమిళంలో ఉన్న నేపధ్యంలో ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సిని పరిశీలకులు అభిప్రాయాపడుతున్నారు. దానికి తోడు విజయ్ సేతుపతితో కాబట్టి బొమ్మ సూపర్ హిట్ అంటున్నారు. ఇటీవల సమంతా నటించిన జానూ సినిమా భిన్నమైన టాక్ తో దూసుకుపోతుంది. తమిళ సినిమా 96 కి రీమేక్ గా ఈ సినిమా వచ్చింది. సమంతా సరసన శర్వానంద్ నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: