‘ఆర్ ఎక్స్ 100’ ఘన విజయం తరువాత దర్శకుడు అజయ్ భూపతి కెరియర్ చాల టాప్ ట్రాక్ లోకి వెళ్ళిపోతుందని చాలామంది భావించారు. అయితే జరుగుతున్న పరిణామాలు మాత్రం వేరు. ఈ దర్శకుడు మనసు పెట్టి వ్రాసుకున్న ‘మహాసముద్రం’ కథ చాలామందికి నచ్చినా అజయ్ భూపతితో మూవీ చేయడానికి ఏ హీరో సాహసించ లేకపోతున్నాడు. 


ఇలాంటి పరిస్థితులలో ఈ కథ నాగచైతన్యకు బాగా నచ్చినా మధ్యలో సమంత వచ్చి అడ్డుపుల్ల వేయడంతో ఈ మూవీ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళకుండా ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఈ కథకు శర్వానంద్ ఓకె చెపుతున్నా అతడు పెడుతున్న కండిషన్ అజయ్ భూపతికి తలనొప్పిగా మారింది అని అంటున్నారు.


ఈ మూవీలో కీలకమైన హీరోయిన్ పాత్రను సమంత చేత నటింప చేయడానికి అజయ్ భూపతి ఒప్పిస్తే తాను డేట్స్ ఇవ్వడానికి అభ్యంతరం లేదు అంటూ శర్వానంద్ కొత్త కండిషన్స్ పెడుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ‘జాను’ ఫలితం తేలిపోవడంతో మరొకసారి శర్వానంద్ తో నటించే అభిప్రాయం సమంతకు లేనట్లు తెలుస్తోంది. 

 

దీనితో ఈ సినిమా కథ నచ్చి నిర్మించడానికి సితార బ్యానర్ ముందుకు వచ్చినా హీరో దొరకక పోవడంతో ఈ మూవీ ప్రాజెక్ట్ ఒక అడుగు ముందుకు వెళితే మరో రెండడుగులు వెనక్కు వెళుతోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వస్తున్నాయి. ‘ఆర్ ఎక్స్ 100’ సూపర్ హిట్ అయినా ఆ మూవీ దర్సకుడుకు కానీ హీరోకి కానీ అదేవిధంగా హీరోయిన్ కు కానీ ఏమాత్రం కలిసి రాకపోవడం వారి దురదృష్టం అనుకోవాలి. ప్రస్తుతం శర్వానంద్ వరస ఫ్లాప్ లపై కొనసాగుతూ ఉండటంతో భవిష్యత్ లో అతడు ఎంచుకునే కథల విషయంలో చాల జాగ్రత్తలు తీసుకోకపోతే కెరియర్ పరంగా భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది అంటూ అతడి సన్నిహితులు సలహాలు యిస్తున్నట్లు టాక్. ఈ హీరో భవిష్యత్ ప్రాజెక్ట్స్ పై కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు తెలుస్తోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: