టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ బ్యాచ్‌ల‌ర్‌గా వేరు వేయించుకున్న హీరో నితిన్‌. వ‌రుస‌గా మూడు ఫ్లాప్‌ల‌ని సొంతం చేసుకుని రేస్‌లో మ‌ళ్లీ వెన‌క‌బ‌డ్డాడు.  అయితే తాజాగా ప్ర‌స్తుతం ఆయ‌న వ‌రుస చిత్రాల‌తో షాకిస్తున్నాడు. హిట్‌, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా గురువు ప‌వ‌న్ త‌ర‌హాలోనే ఏకంగా నాలుగు చిత్రాల్ని లైన్‌లో పెట్టేశాడు. `ఛ‌లో` ఫేమ్ వెంకీ కుడుముల‌తో `భీష్మ‌` చిత్రం చేస్తున్న నితిన్ ఇది చిత్రీక‌ర‌ణ‌లో వుండ‌గానే మ‌రో చిత్రాన్ని కూడా ప‌ట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి పీసీ శ్రీ‌రామ్ ఫొటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

 

`రంగ్‌దే` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంతో కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా వుంటే విభిన్న‌చిత్రాల ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రాన్ని చేస్తున్నాడు. `చెక్‌` పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూడు చిత్రాలు సెట్స్‌పై వుండ‌గానే మ‌రో హిట్ రీమేక్‌కి ప‌చ్చ జెండా ఊపేశాడు. బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా న‌టించిన చిత్రం `అంధాధున్‌`. రాధికా ఆప్టే. ట‌బు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ఆయుష్మాన్ ఖురానాకు జాతీయ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. ఇదే చిత్రాన్ని తెలుగులో నితిన్ చేయ‌బోతున్నాడు.

 

దీనికి స‌రైన ద‌ర్శ‌కుడి కోసం ఎదురుచూస్తున్న నితిన్ ఫైన‌ల్‌గా నాని ద‌ర్శ‌కుడిని ప‌ట్టేశాడు. నానితో `కృష్ణార్జున యుద్ధం` చిత్రాన్ని రూపొందించిన మేర్ల‌పాక గాంధి గ‌త రెండేళ్లుగా నెక్స్‌ట్‌ మూవీ కోసం ఎదురుచూస్తున్నాడు. అత‌నికి `అంధాధున్‌` రీమేక్ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించిన‌ట్టు తెలిసింది. స‌మ్మ‌ర్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని స్వ‌యంగా నితిన్ న‌టిస్తూ నిర్మించ‌నున్నారు. 

 

అయితే ఈ చిత్రంలో నితిన్ కాస్త పెద్ద స్టెప్ వేస్తున్న‌ట్లే అనుకోవాలి. గ‌తంలో ర‌వితేజ న‌టించిన రాజా ది గ్రేట్ చిత్రంలో అంధుడిగా న‌టించి హిట్ కొట్టాడు. అయితే రాజ్ త‌రుణ్ హీరోగా వ‌చ్చిన అంద‌గాడు సినిమా మాత్రం ఫెయిల్ అయింది.మరోవైపు బాలీవుడ్ లో హృతిక్ కూడా ఇటీవల కాబిల్ సినిమాలో అంధుడిగా నటించడం జరిగింది. అయితే ఒకరకంగా ఆ విధమైన పాత్రలో నటించడం కొంత ఛాలెంజ్ అనే చెప్పాలి. మరి నితిన్ దానిని ఎంత సమర్ధవంతంగా ఎదుర్కొంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: