టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ‘జయం’ సినిమాతో చిత్రపరిశ్రమలో తన తొలి అడుగు వేసాడు.. ఇక మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నితిన్ నటనపరంగా మంచి మార్కులు కొట్టేసాడు.. ఆ తరువాత వరుస సినిమాలతో కెరీర్ పరంగా మంచి జోష్ మీద ముందుకు సాగుతున్న తరుణంలో, అనుకోని విధంగా వరుస ఫ్లాప్ లతో సతమతమయ్యాడు. ఈ దశలో నితిన్ పని అయిపొయిందని,  అందరూ కూడా అనుకున్నారు. ఇలాంటి సమయంలో ‘ఇష్క్’ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు నితిన్.

 

 

ఇకపోతే తాజాగా ఒక ఇంటివాడు అవడానికి కూడా అంతా సిద్దం అయిపోతున్న తరుణంతో పాటుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన హీరో, హీరోయిన్లుగా నటించిన భీష్మ సినిమా కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకీ, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది..  ఇప్పటికే ఈ సినిమాపై చిత్ర పరిశ్రమలోను, అటు ప్రేక్షకులలోను భారీ అంచనాలే నెలకొన్నాయి.

 

 

ఇదిలా ఉండగా ఈ చిత్రం పూర్తికాగానే మరో సినిమాపై నితిన్ దృష్టి పెట్టాడు. ఇప్పటికే రంగ్ దే అనే సినిమా చేస్తోన్న నితిన్.. మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేసేందుకు నితిన్ రెడీ అవుతున్నాడట. ఇక భీష్మ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్రీకరణలో గాని, మిగతా వర్క్ విషయంలో గాని వేగాన్ని పెంచారట చిత్రయూనిట్..

 

 

ఇకపోతే నితిన్ భీష్మ చిత్రంలో ఖైదీగా కనిపించనున్నారట. ఇందుకు గాను జైలు సెట్‌లోనే ఎక్కువగా గడపవలసి వస్తుందట.. అంతే కాకుండా ఈ చిత్రం అంతా కూడా జైలు బ్యాక్ డ్రాప్ లోనే రూపొందనుందట. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా, భవ్య క్రియేషన్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: