ఇదిలా ఉంటే నితిన్ ఈ సినిమా ప్రమోషన్స్ తోపాటు తన పెళ్లి పనులతో బిజీ గా వున్నాడు. తన ప్రియరాలు షాలినిని, నితిన్ వివాహం చేసుకోనున్నాడు. ఏప్రిల్ 15న దుబాయిలో వీరి పెళ్లి జరుగనుందని సమాచారం. ఇక భీష్మ తరువాత నితిన్ ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రంగ్ దే ఒకటి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయ్యింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాతో పాటు సాహసం ఫేమ్
చంద్రశేఖర్ యేలేటి తో
చెక్ అనే
సినిమా చేస్తున్నాడు నితిన్.
భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో
నితిన్ సరసన
రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా ప్రకాష్
వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదే విడుదలకానున్నాయి. మరి ఈఏడాది మూడు సినిమాలతో వస్తున్న
నితిన్ హ్యాట్రిక్ విజయాలను సాదిస్తాడో లేదో చూడాలి.