యంగ్ హీరో నితిన్, ఛలో ఫేమ్ వెంకీ కడుముల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం భీష్మ .మరో వారం రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. దాంతో ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. అందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 17న  గ్రాండ్ గా జరపడానికి  ప్లాన్ చేశారు.. ఈ ఈవెంట్ కు టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథి గా రానున్నాడని తెలుస్తుంది.  యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 
 
ఇదిలా ఉంటే నితిన్సినిమా ప్రమోషన్స్ తోపాటు తన పెళ్లి పనులతో బిజీ గా వున్నాడు. తన ప్రియరాలు షాలినిని, నితిన్ వివాహం చేసుకోనున్నాడు. ఏప్రిల్ 15న దుబాయిలో వీరి పెళ్లి జరుగనుందని సమాచారం. ఇక భీష్మ తరువాత నితిన్ ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రంగ్ దే ఒకటి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయ్యింది. కీర్తి సురేష్  హీరోయిన్ గా నటిస్తుండగా  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.  
 
ఈ సినిమాతో పాటు సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి తో చెక్ అనే సినిమా చేస్తున్నాడు నితిన్. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదే విడుదలకానున్నాయి. మరి ఈఏడాది మూడు సినిమాలతో వస్తున్న నితిన్ హ్యాట్రిక్  విజయాలను సాదిస్తాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: