టాలీవుడ్ స్టైలిష్  స్టార్ అల్లు అర్జున్.. టాలీవుడ్ టాప్ నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా  హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు అర్జున్ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న తెలుగు ప్రేక్షకులందరికీ స్టైలిష్ స్టార్ మారిపోయాడు. ఇక మొన్నటికి మొన్న చాలా గ్యాప్ తర్వాత  అల వైకుంఠ పురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అల్లు అర్జున్. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే కనివిని ఎరుగని వసూళ్లను రాబట్టింది . నూట యాభై కోట్లకి పైగా షేర్ రాబట్టింది అల వైకుంఠ పురములో సినిమా. 

 

 

 కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది. ఇక ఈ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కినది. అయితే సినిమా విడుదలయ్యి  ఇప్పటికే చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికే ఈ సినిమా జోరు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే పలు చోట్ల వసూళ్లు రాబడుతోంది ఉంది అల వైకుంఠ పురములో సినిమా. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో హీరో అల్లుఅర్జున్ ఆనందోత్సాహాల్లో మునిగి పోయారు. ఇదే జోష్ లో  ఓనేషనల్  మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. 

 

 

 ఈ సందర్భంగా తన గురించి జరుగుతున్న ప్రచారం పై కూడా క్లారిటీ ఇచ్చారు అల్లు అర్జున్ . ముంబై లో తన సొంత ఇల్లు ఉంది అని చాలా మంది భావిస్తూ ఉంటారు అని... కానీ అదంతా అవాస్తవమని.. ముంబై నగరంలో  ఇప్పుడు వరకు సొంత ఇల్లు లేదు అంటూ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పష్టం చేశారు. ముంబై లో ఉన్నది గీత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థకు చెందిన గెస్ట్ హౌస్... ముంబై వెళ్ళినప్పుడల్లా ఆ గెస్ట్ హౌస్ లోనే బస చేస్తారు అంటూ వెల్లడించారు. అయితే తనకు ముంబైలో సొంత ఇల్లు కొనుక్కోవాలని ఉంది అంటూ  అల్లు అర్జున్ తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. ముంబై నగరం అంటే ఎంతో ఇష్టమని తెలిపిన అల్లు అర్జున్ అందుకే ముంబై కి ఎక్కువగా  వస్తుంటాను అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: