టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలనటుడిగా చిత్ర సీమలోకి అడుగుపెట్టి, ఆ తరువాత రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారడం జరిగింది. అనంతరం రాజమౌళి తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ తో తొలి సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, ఆపై ఆది, సింహాద్రి వంటి మాస్ సినిమాల అద్భుత విజయాలతో మాస్ హీరోగా తిరుగులేని విజయాలను, పేరును, ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక మొదట్లో కొంత బొద్దుగా ఉండే ఎన్టీఆర్, ఆ తరువాత రాజమౌళి సలహా మేరకు యమదొంగ సినిమాకోసం ఒక్కసారిగా చాలా వెయిట్ తగ్గడం జరిగింది. 

 

ఇక ఇటీవల టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వంటి వరుస విజయలతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ కు ప్రేక్షకుల తో పాటు కొందరు సినిమా నటుల్లో కూడా వీరాభిమానులున్నారు. ఆ విధంగా ఎన్టీఆర్ ని ఎంతో ఇష్టపడే నటీమణుల్లో సీనియర్ యాక్ట్రెస్ ఖుష్బూ అందరికంటే ముందు స్థానంలో ఉంటారు. తనకు ఎన్టీఆర్ స్టైల్, యాటిట్యూడ్, ముఖ్యంగా ఆయన సహజత్వంతో ఎంతో గంభీరంగా పలికే డైలాగ్స్ అంటే అమితమైన ఇష్టం అని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఖుష్బూ. ఆయన్ను ఎంత పిచ్చిగా అభిమానిస్తానో నాకే తెలుసు. ఆయన ప్రతి సినిమాను చిన్నపిల్లలా, మొదటి రోజే చూసేందుకు ఎంతో ఆసక్తి చూపుతాను. చూడటం కూడా మామూలుగా కాదు విజిల్స్‌ వేస్తూ, కాగితాలు చించేస్తూ, చప్పట్లు, కేరింతలతో తాను సినిమాను చూసి ఎంజాయ్‌ చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు.

 

ఇక ఆయన సినిమాలు మొదటి నుండి తాను చూస్తున్నానని, సినిమా సినిమాకు ఆయన నటనలో పరిణితి మరింత వృద్ధి చెందడంతో పాటు, హీరోగా మరిన్ని అత్యున్నత శిఖరాలు అందుకుంటూ ముందుకు పోరుతున్నారని, ఇక తనకు యమదొంగ సినిమాలో యముడి భార్యగా అవకాశం వచ్చినపుడు తన ఆనందం పట్టలేనిదని అన్నారు. కాగా ఆ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తో మాట్లాడి ఆటోగ్రాఫ్ తీసుకున్నానని ఆమె అన్నారు. ఇక ఇటీవల ఒక టివి షోలో ఎన్టీఆర్ పై తనకు ఉన్న అమితమైన అభిమానాన్ని వ్యక్తపరిచిన ఖుష్బూ, ఆయన ఫోటోపై ముద్దుల వర్షం కురిపించారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: