రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే  ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యాలని భావిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో ఈ సినిమాకు సంబంధించిన కీలక షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. హీరోయిన్లు గా ముగ్గురు నటిస్తుండగా కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నాడు. దీనితో ఈ సినిమాకు ఇప్పుడు భారీ హైప్ వచ్చింది. 

 

టాలివుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఈ సినిమా ఒకటిగా నిలుస్తుంది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అటు సిని పరిశీలకులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా మొత్తం సినిమా పరిశ్రమను నడిపిస్తుందని, ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక కీలక విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం రాజమౌళి ఇప్పుడు తీవ్రంగా కష్టపడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. 

 

ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య ఉండే సన్నివేశాల విషయంలో ఇప్పటి వరకు మూడు సార్లు షూటింగ్ చేసినా సరే కొన్ని సీన్లు సరిగా రాలేదని... దీనితో మళ్ళీ వాటిని రీ షూట్ చెయ్యాలని... అందుకోసం ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళాలి అని ఆయన భావిస్తున్నారట. ఇక విశాఖ జిల్లాలోని అరకులో ఉన్న ఒక కొండ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరిగే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతుందని ప్రచారం జరుగుతుంది. ఏది ఎలా ఉన్నా గాని రాజమౌళిసినిమా కోసం ప్రాణం పెట్టారు అనే అంటున్నారు సినీ పరిశీలకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: