ముందుగా బాలీవుడ్ లో ఫగ్లీ అనే సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన కియారా అద్వానీ, ఆ తరువాత ఇండియన్ క్రికెటర్ ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎమ్ ఎస్ ధోని అనే సినిమాలో దిశా పటాని తో పాటు మరొక హీరోయిన్ గా నటించింది.  ఇక ఆ సినిమాలో తన ఆకట్టుకునే అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఆ తరువాత టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ సరసన భరత్ అనే నేను అనే సినిమాలో హీరోయిన్ ఛాన్స్ సంపాదించిన కియారా, ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించింది. 

 

అయితే ఆ తరువాత రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాలో నటించిన కియారా, ఆ సినిమాతో ఊహించని విధంగా ఘోరమైన ఫ్లాప్ ని ఎదుర్కొంది. ఇక ఆ తరువాత నుండి బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన కియారా ఇటీవల కబీర్ సింగ్, గుడ్ న్యూజ్ అనే సినిమాల్లో నటించి మంచి హిట్స్ అందుకుంది. ఇక ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న లక్ష్మి బాంబుతో పాటు, ఇందూ కి జవానీ, భూల్ భులాయ 2 సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే యూత్ లో ఎంతో మంచి ఫాలోయింగ్ సంపాదించిన కియారా, ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ని ఫాలో అవుతూ ఉంటుంది. 

 

ఇక ఎప్పుడూ ఒకింత ట్రేడ్రిషనల్ వేర్ లో కనిపించే కియారా, నేడు హఠాత్తుగా ఎంతో హాట్ గా ఒకింత తన యద అందాలు కనపడేలా డ్రెస్ వేసుకుని దిగిన ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలు చూసిన పలువురు, అబ్బబ్బబా కియారా, కుర్రాళ్లకు కిక్కెక్కించేలా ఏమా ఒంపుల్, సొంపుల్ అంటూ ఆమె అందంపై పొగడ్తలు కురిపిస్తూ పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: