బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ నుండి ఎవరు వెళ్లినా.. ఎవరు వచ్చినా ఆ షోకి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఆరేడేళ్లుగా జబర్దస్త్ షోని ఫాలో అవుతున్న ఆడియెన్స్ ఇప్పటికి ఆ షో మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు కంటెస్టంట్స్ కూడా కొత్త కొత్త స్కిట్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. జబర్దస్త్ నుండి మెగా బ్రదర్ నాగబాబు వెళ్లిపోవడం షోకి మైనస్ అవుతుందని భావించారు. జబర్దస్త్ డైరక్టర్స్ నితిన్, భరత్ బయటకు వెళ్లడం వారితో పాటుగా నాగబాబు జీ తెలుగు అదిరింది షోకి వెళ్లిన విషయం తెలిసిందే.

 

జబర్దస్త్ 2గా అదిరింది.. సెట్టు, ఛానెల్ మారిందే తప్ప మిగతా అంతా సేమ్ టూ సేమ్ అనిపిస్తుంది. ఇదిలాఉంటే జబరస్త్ నుండి వెళ్లిన జడ్జ్ నాగబాబు ప్లేస్ లో పర్మినెంట్ గా ఎవరిని పెట్టాలో అని నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. మొదట్లో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లను తెచ్చి మ్యానేజ్ చేసిన జబర్దస్త్ టీం రెండు మూడు వారాల నుండి సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ నాగూర్ బాబు అలియాస్ మనోని తెచ్చి పెట్టారు. ఆయన తరహా కామెడీతో అడపాదడపా పంచులతో జడ్జ్ గా పర్వాలేదు అనిపిస్తున్నాడు. శేఖర్ మాస్టర్ ఎలాగు ఢీ చేస్తున్నాడుగా జబర్దస్త్ కూడా కొనసాగించే అవకాశం ఉన్నా అతను కంటెస్టంట్స్ కామెడీ చేస్తుంటే వారికన్నా ముందే డైలాగ్స్ చెబుతూ వారిని డిస్ట్రబ్ చేస్తున్నాడు.

   

అందుకే శేఖర్ మాస్టర్ డ్యాన్స్ షోకే బెటర్ అని భావిస్తున్నారు. దాదాపుగా మనోనే మంచి ప్యాకేజ్ ఇచ్చి జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ జడ్జ్ గా కొనసాగేలా అగ్రిమెంట్ చేసుకుంటారని తెలుస్తుంది. నాగబాబు ప్లేస్ లో నాగూర్ బాబు అదే మన మనో అయితేనే బెటర్ అని అంటున్నారు. ఈయన అయితే అందరికి తెలుసు కాబట్టి జడ్జ్ గా ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేస్తారని అంటున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: