సంక్రాంతి కానుకగా మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. దీనితో ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా ప్లాన్ చెయ్యాలని భావిస్తున్నాడు. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాను ఆడించే విధంగా ప్రచారం కూడా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇక ఈ సినిమాను సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో కూడా తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. 

 

ఇంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు అల్లు అర్జున్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బాలీవుడ్ లో అడుగుపెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అల వైకుంఠపురములో సినిమా మంచి విజయం సాధించడంతో అల్లు అర్జున్ కాస్త మారినట్టు సమాచారం. ఇప్పుడు బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. తాను నిర్మాతగా అల వైకుంఠపురములో సినిమాను సల్మాన్ ఖాన్ తో చెయ్యాలని చూస్తున్నాడట. ఇదే విషయాన్ని తన తండ్రి వద్ద కూడా ప్రస్తావించినట్టు సమాచారం. అటు సల్మాన్ ఖాన్ తో మాట్లాడటానికి ముంబై కూడా వెళ్తున్నట్టు తెలిసింది. 

 

త్వరలోనే ముంబై వెళ్లి సల్లుభాయ్ తో ఈ విషయం చర్చించి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమాను చెయ్యాలని చూస్తున్నాడు. ఈ సినిమా మీద బాలివుడ్ నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. బాలివుడ్ ప్రముఖ నిర్మాత ఒకరు ఇప్పటికే అల్లు అరవింద్ ని కూడా సంప్రదించారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన బాలీవుడ్ వర్క్ మొదలుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎదిలా ఉన్నా ఇప్పుడు బన్నీ మాత్రం దూకుడు పెంచడ౦ పలువురికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: