సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఏ సినిమా చేస్తారు అనేది మహేష్ అభిమానుల్లో ఉన్న సందేహం. ఇప్పుడు మహేష్ తో సినిమా చెయ్యడానికి దాదాపు నలుగురు దర్శకులు లైన్ లో ఉన్నారు. కాబట్టి మహేష్ ఎవరిని ఎంచుకుంటారు అనేది చూడాల్సి ఉంది. వంశీ పైడపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమా చేస్తాడనే టాక్ వినపడుతుంది. 

 

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు విదేశాలకు వెళ్ళిపోయాడు. ప్రస్తుతం హాలిడే ఎంజాయ్ చేస్తున్నాడు. అతనికి సంబంధించిన ఏ వార్త కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు. ప్రస్తుతం మహేష్ అమెరికాలోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వారం అతని గురించి పెద్దగా అప్డేట్ లేకపోయినా సరే మహేష్, ప్రభాస్ కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ సినిమా వస్తుంది అనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వినపడుతుంది. మహేష్ తో రాజమౌళి సినిమా చెయ్యాలని చూస్తున్నారని, అందుకే మహేష్ బాబు ఆగుతున్నారని అంటున్నారు. 

 

వచ్చే ఏడాది మహేష్ బాబు ప్రభాస్ మోవీ మొదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. దీనికి మహేష్ ఏమి అంటారు అనేది తెలియలేదు. ఇక దిల్ రాజు నిర్మాణం లో సినిమా చేస్తారు అని ఈ వారమే ఒక వార్త వచ్చింది. అది కూడా స్పష్టత లేదు కాబట్టి మహేష్ ఎం చేస్తారు అనేది చూడాలి. టాలీవుడ్ లో మహేష్ కి క్రేజ్ ఎక్కువ కాబట్టి అతని నుంచి ఏ వార్త బయటకు వస్తుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరి మహేష్ ఎం చెప్తాడో ఎవరితో సినిమా చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: