ప్రస్థుతం పేపర్ చూసినా ఛానల్స్ లో వార్తలు విన్నా ఎక్కడ చూసినా కరోనా వైరస్ గురించి వార్తలే ఉంటున్నాయి. ఈ వైరస్ దెబ్బకు ప్రజలు చికెన్ తినడం మానేయడంతో పౌల్ట్రీ వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఈ వైరస్ భయం అల్లు అర్జున్ సుకుమార్ లను వెంటాడటం హాట్ న్యూస్ గా మారింది. 

 

బన్నీ సుకుమార్మూవీ కథ అంతా గందపు చెక్కల స్మగ్లింగ్ నేపద్యంలో ఉండబోతోంది. దీనితో ఈ మూవీని చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవులలో తీయాలని భావించారు. అయితే ప్రభుత్వ అనుమతులు రావడం కష్టంగా మారడంతో ఈ మూవీ షూటింగ్ ను థాయిలాండ్ లోని దట్టమైన అరణ్యాలలో తీయడానికి లోకేషన్స్ ఫైనల్ చేసుకుని ఈనెలలోనే అక్కడ షూటింగ్ మొదలు పెట్టాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.  


అయితే థాయిలాండ్ లో కూడ కరోనా వైరస్ కలకలం కనిపించడంతో ఈ వైరస్ బాగా వ్యాప్తి చెందే అవకాసం ఉన్న అరణ్యాలలో షూట్ చేయడం మంచిది కాదని సుకుమార్ కు సలహాలు వచ్చినట్లు టాక్. దీనితో ఈ మూవీ షూటింగ్ ను వాయిదా వేసి యూరప్ దేశాలలోని ఎదో ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టాలని ఇప్పుడు యాక్షన్ ప్లాన్ మారినట్లు వార్తలు వస్తున్నాయి. 

 

అయితే కరోనా వైరస్ వ్యవహారం సద్దుమణిగే వరకు దట్టమైన అరణ్యాలలోకి వెళ్ళి రిస్క్ చేయడం ఎందుకు అంటూ మరికొందరు బన్నీ సుకుమార్ లకు సలహాలు ఇస్తున్నట్లు సమాచారం. దీనితో ఇప్పటికే ‘అల వైకుంఠప్రములో’ మూవీ షూటింగ్ లో ఆలస్యం ఆతరువాత ఆ మూవీ ప్రమోషన్ వల్ల ఇలా రకరకాల కారణాలతో వాయిదా పడ్డ బన్నీ సుకుమార్ ల మూవీకి కరోనా దెబ్బ తగిలింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో బన్నీ సుకుమార్ లు అరణ్యాలలోకి వెళ్ళి సాహసం చేస్తారా లేదంటే కరోనా వైరస్ కు వేక్సిన్ దొరికే దాకా వేచి ఉంటారా అన్నది సమాధానం లేని ప్రశ్న..

 

మరింత సమాచారం తెలుసుకోండి: