చలో  సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయమైన రష్మిక మందన తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఇక వరుస సినిమా అవకాశాలను తక్కించుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్నది  రష్మిక మందన. మొన్నటికి మొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన చాన్స్ కొట్టేసిన రష్మిక మందన్న సరిలేరు నీకెవరు సినిమాలో నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగిపోయింది. కాగా  ప్రస్తుతం రష్మిక మందన్న నితిన్ సరసన నటిస్తోంది. నితిన్ హీరోగా చలో దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో తెరకెక్కుతున్న భీష్మ సినిమాలో అందాల ముద్దుగుమ్మ రష్మిక  నటిస్తోంది. 

 

 కాగా ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కాగా భీష్మ సినిమా ఈ నెల 21న విడుదల కాబోతుండగా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం చిత్ర బంధం బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో మాట్లాడిన రష్మిక మందన... ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ వాలెంటైన్స్ డే ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రష్మిక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పింది.  ఈ వాలెంటైన్స్ డే తనకు ఎంతో బోరింగ్ గా సాగింది అంటూ చెప్పుకొచ్చింది. ఒక రొమాంటిక్ సినిమా చూసి వాలెంటెన్స్ డే రోజు ఎంజాయ్ చేద్దాం అనుకుంటే... ఆ సినిమా 30 నిమిషాలకు బోర్ కొట్టేసింది అంటూ  రష్మిక మందన తెలిపింది. 

 

 అది తెలుగు మూవీ కాదని ఇంగ్లీష్ మూవీ అంటూ  ముందే చారిటీ ఇచ్చింది . ఇక తన స్టార్ డమ్ గురించి మాట్లాడుతూ మంచి స్క్రిప్టులు ఎంచుకుంటూ  క్యారెక్టర్ కి తగ్గట్లు కష్టపడి బాగా పని చేయాలి అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన. అంతే కానీ స్టార్ డమ్  అనేది లక్కు వల్ల రాదు అంటూ తెలిపింది.నేను  ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగాను అంటే అది కేవలం నా హార్డ్వర్క్ వల్లే అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. భీష్మ లో తన పాత్ర ఎంతగానో బాగుంటుందని... ఈ సినిమాలో నేను చేసిన యాక్టింగ్,  డాన్స్ అన్ని బాగా నచ్చాయి అంటూ చెప్పుకొచ్చింది. సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ గా  సాగిపోతుంటుంది అంటూ రష్మిక మందన్న తెలిపింది .

మరింత సమాచారం తెలుసుకోండి: