టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా మంచి విజయాన్ని, అలానే కలెక్షన్ ని అందుకుంది. మహేష్ బాబు ఒక మిలిటరీ మేజర్ గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, సీనియర్ నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించడం జరిగింది. ఇకపోతే దీని తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అతి త్వరలో మహేష్ బాబు ఒక సినిమా చేయనున్నారు. 

 

మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఎంతో భారీ లెవెల్లో ప్రారంభం కానున్న ఈ సినిమాని జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నేడు మహేష్ తదుపరి సినిమాకు సంబందించిన ఒక వార్త పలు ఫిలిం నగర్ వర్గాల్లో ఎంతో వైరల్ అవుతోంది. అదేమిటంటే, అతి త్వరలో మహేష్ బాబు, సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు టాక్. ఆయనతో మహేష్ నటించిన ఒక్కడు సినిమా అప్పట్లో ఎంతో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. 

 

ఆ తరువాత వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన అర్జున్ యావరేజ్ విజయాన్ని అందుకోగా, ఆపై వచ్చిన సైనికుడు సినిమా మాత్రం ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇక మళ్ళి ఇన్నేళ్లకు వీరిద్దరూ ఇటీవల ఒక ఒకరోజు కలిసారని, అయితే మాటల సందర్భంలో తన వద్ద ఉన్న ఒక పవర్ఫుల్ స్టోరీని మహేష్ కు వినిపించారట గుణ శేఖర్. అది విన్న మహేష్, ఎంతో అద్భుతంగా ఉందని, తప్పకుండా సినిమా చేద్దాం, ఈలోపు దాని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని అన్నారట. అయితే దీనిపై ఎక్కడా అధికారిక సమాచారం లేనప్పటికీ ఈ వార్త అటు సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ఎంతో వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: