'చలో' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రష్మిక మందన. అంతకుముందు కన్నడ సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ గా రాణించిన సమయములో డైరెక్టర్ తో ప్రేమలో పడి నిశ్చితార్థం దాకా కూడా వెళ్ళింది. అయితే ఆ తర్వాత ఆ డైరెక్టర్ కెరియర్ పరంగా బిజీ కావడం తో పాటుగా రష్మిక మందన కూడా సినిమా రంగంలో మంచి స్థాయిలో కి రావడంతో ఆ విషయం మరుగున పడిపోయింది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వరుసబెట్టి అవకాశాలు దక్కించుకుంటూ అదిరిపోయే విజయాలు సాధించి తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టి అదిరిపోయే హిట్ కొట్టిన రష్మిక మందన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.

 

ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఇటీవల నితిన్ తో భీష్మ సినిమాలో హీరోయిన్ గా చేయటంతో ఆ సినిమా త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినిమాల గురించి అనేక విషయాలు మీడియాకు తెలియచేసింది. ఈ సందర్భంగా ఓ మీడియా విలేఖరి రష్మిక మందన ని  మీకు ఎవరిపైన క్రష్ ఉందని, ఫ్యూచర్ లో ఎవరితో నటించాలని అనుకుంటున్నారని ప్రశ్నించగా, రష్మిక మందన్న ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

 

తనకి చిన్ననాటి నుండే తమిళ నటుడైన ఇళయ దళపతి విజయ్ ఫై క్రష్ ఉండేదని చచ్చేంత ఇష్టం అని అన్నారు, అంతేకాకుండా అతనితో ఫ్యూచర్ లో నటించాలని ఉంది అని తెలియజేసారు. అయితే విజయ్ ప్రస్తుతం నటిస్తున్న మాస్టర్ చిత్రానికి మొదటగా రష్మిక హీరోయిన్ గా అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వలన తాను నటించలేదు. ఒకపక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తూనే మరోపక్క తమిళ సినిమా రంగం నుండి కూడా ఈ ముద్దుగుమ్మకి అనేక అవకాశాలు రావడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: