పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లతో నితిన్ కి అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. నితిన్ కి 'అఆ' లాంటి మంచి హిట్ ని ఇచ్చారు త్రివిక్రమ్. ఓవర్సీస్ లోనూ నితిన్ ని బాగానే నిలబెట్టాడు. అయితే 'అఆ' తర్వాత మళ్లీ త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ప్రయత్నించినా ఇప్పటి వరకు మళ్ళీ నితిన్ కి వర్కౌట్ అవలేదు. పవన్ కల్యాణ్ .. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ లాంటి బిగ్ స్టార్స్ తో త్రివిక్రమ్ వరుసగా సినిమాలకు కమిటవ్వడంతో నితిన్ కి మళ్ళీ అవకాశం ఇవ్వలేకపోయారు గురూజీ. అయినా నితిన్ మాత్రం మళ్ళీ గురూజీ కాంబినేషన్ లో ఒక హిట్ కొట్టాలని తాపత్రయపడుతున్నాడు. 

 

అఆ తర్వాత మళ్లీ అలాంటి క్లాసిక్ హిట్ నితిన్ కెరీర్ లో పడకపోవడంతో పాటు... వరుసగా లై, ఛల్ మోహన రంగా వంటి సినిమాలు చేసినా అవన్నీ దారుణం గా ఫ్లాపులయ్యాయి. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాని కంప్లీట్ చేశాడు. ఈనెల 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా  ఫిబ్రవరి 17 న హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చిత్రబృందం ప్లాన్ చేశారు. అంతేకాదు ఈవెంట్ కి త్రివిక్రమ్ ని ముఖ్య అతిథిగా భీష్మ టీమ్ ఆహ్వానించింది. భీష్మ సినిమాని నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో త్రివిక్రమ్ రిలేషన్ మరియు నితిన్ తో త్రివిక్రమ్ ఉన్న రిలేషన్ తో  ఆయననే అతిధిగా ఆహ్వానించారు. దాంతో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

అయితే నితిన్ కి అర్జెంటుగా త్రివిక్రమ్ నుంచి ఆఫర్ కావాలి. అందుకే ఆయన వెంట సినిమా ప్లాన్ చేయాలని నితిన్ స్కెచ్ వేశాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అఆ తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ తీస్తామని అప్పట్లో చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు త్రివిక్రమ్. ఇప్పటికైనా యూత్ స్టార్ పై మాటల మాంత్రీకుడు ఆసక్తి చూపిస్తారా అంటే ఇప్పట్లో అయితే అది జరిగే సూచనలు కనిపించడం లేదు. ఎన్టీఆర్.. మహేష్.. అల్లు అర్జున్.. చరణ్ ఇలా టాప్ స్టార్లంతా త్రివిక్రమ్ క్యూలో ఉన్నారు. వాళ్లను కాదని త్రివిక్రమ్ నితిన్ తో సినిమా చేసే ఛాన్సే లేదని టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. అయితే నితిన్ మాత్రం ఈ ఈవెంట్ కి రాకపోతే అసలు ఈవెంటే చేయనని అన్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: