పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ అనే బాలీవుడ్ సినిమా అధికారిక తెలుగు రీమేక్ లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్లాయర్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఓ మై ఫ్రెండ్, నానితో ఎంసీఏ సినిమాలు తీసిన వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, అలానే బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక దీని తరువాత పవన్ కళ్యాణ్ ఒక భారీ పీరియాడికల్ మూవీ లో నటించనున్న విషయం తెలిసిందే. 

 

రాబిన్ హుడ్ తరహా గజ దొంగ పాత్రలో పవన్ నటించనున్న ఆ సినిమాకు గమ్యం, వేదం, గౌతమి పుత్ర శాతకర్ణి ఫేమ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా ఏఎమ్ రత్నం ఆ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక ఆ సినిమా కోసం ఇప్పటికే పలు భారీ సెట్టింగుల నిర్మాణం జరుగుతుండగా, మరోవైపు దర్శకుడు క్రిష్, సినిమాలోని ఇతర పాత్రధారుల ఎంపిక కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని, ఇక అందులో భాగంగా సినిమాలోని ఒక కీలకమైన పాత్ర కోసం సీనియర్ యాక్టర్ జగపతి బాబుని సెలెక్ట్ చేసినట్లు టాక్. జగపతి బాబు నటించనున్న ఆ పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందని, అయన అయితేనే దానికి న్యాయం చేయగలరని సెలెక్ట్ చేసినట్లు టాక్. 

 

ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష, నయనతార, అనుష్క, నయనతార వంటి వారి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో జగపతి బాబుని తీసుకున్న విషయం ప్రస్తుతం ప్రచారం అవుతున్నప్పటికీ, దానిపై అధికారిక ప్రకటన మాత్రం వెల్లడి కావలసి ఉంది. అదే కనుక నిజం అయితే, జగపతి బాబుకు మరొక పవర్ఫుల్ రోల్ దక్కినట్లే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: