సూపర్ స్టార్ మహేష్ బాబు- డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి, బిజినెస్ మేన్ చిత్రాలు ఎంత మంచి విజయం సాధించాయో అందరికీ తెలిసిందే.. పోకిరి సినిమాలో అప్పటి వరకు మనం చూడని మహేష్ ని చూపించాడు పూరిజగన్నాథ్. పండు అనే క్యారెక్టర్ లో మహేష్ నటన అద్భుతమనే చెప్పాలి. ఆ సినిమాలో మహేష్ డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ సీన్లు కానీ మరో లెవెల్ లో ఉంటాయి. అప్పట్లో పోకిరి రేపిన సంచలనం అంతా ఇంతా కాదు.

 

 

ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమతోనే మహేష్ కి మాస్ జనాల్లో ఫాలోయింగ్ పెరిగిందంటే అతిశయోక్తి కాదు. పోకిరి తర్వాత మహేష్ పూరి కలిసి చేసిన చిత్రం బిజినెస్ మేన్. మహేష్ లాంటి స్టార్ హీరోతో కేవలం అరవై రోజుల్లో సినిమా పూర్తి చేసిన ఘనత పూరికి దక్కుతుంది. ఈ సినిమాలో మహేష్ పలికే డైలాగులు చాలా యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ రెండు చిత్రాల తర్వాత వీరిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది.

 

 


ఆ గ్యాప్ వాళ్ళ వరకే ఉండాల్సింది పోయి జనాలకి కూడా తెలిసిపోయింది. పూరిజగన్నాథ్ మహేష్ బాబుతో జనగణమన సినిమా చేద్దామని కథ కూడా చెప్పాడట. ఆ సినిమా గురించి మహేష్ తన సమాధానం ఇవ్వలేదని పూరి ఆరోపించాడు. ఈ విషయాన్ని మీడియా ముఖంగా కూడా చెప్పాడు పూరి. దాంతో కొంత అసంతృప్తికి గురైన మహేష్ బాబు మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తనకి హిట్లు ఇచ్చిన అందరి దర్శకుల గురించి ప్రస్తావించాడు.

 

 

కానీ అందులో పూరిజగన్నాథ్ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన మరుసటి రోజు మహేష్ తాను పూరిజగన్నాథ్ గురించి మర్చిపోయానని.. నా సినిమా కెరీర్లో పోకిరి సినిమాకి చాలా ఇంపార్టెన్ ఉందని ట్వీట్ చేశాడు.. అయితే దీని గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. పోకిరి వంటి సినిమాని మహేష్ మర్చిపోవడం ఏంటని..అలా జరిగి ఉండదని అంటున్నారు. మరి ఇది నిజమో కాదో మహేష్ కే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: