సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ పేరులోనే మత్తు ఉంది.. స్టైల్ ఉంది.. వైబ్రేషన్స్ ఉన్నాయ్.. అందుకే అమ్మాయిలకు కలల రాకుమారుడు అయ్యాడు. టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌతిండియా వైడ్ మహేష్ బాబును ఆరాధించే అభిమానులు ఉన్నారు. ఇక అలనాటి సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ సినీ వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన మహేష్ బాబు `రాజకుమారుడు` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతి జింత నటించారు. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన `యువరాజు` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో మహేష్ సరసనసాక్షి శివానంద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> సాక్షి శివానంద్, సిమ్రాన్ హీరోయిన్ లుగా నటించారు. 2000లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద యావరేజ్ ఫలితం అందుకుంది. అయితే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా హీరోయిన్లుగా నటించినసాక్షి శివానంద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> సాక్షి శివానంద్, సిమ్రాన్ ఇద్దరూ మహేష్ బాబు కంటే వయసులో పెద్దవాళ్ళు. పైగా ఈ సినిమాలో మహేష్ బాబు ఓ బిడ్డకు తండ్రి గా నటించాడు. దీంతో సిమ్రాన్ పక్కన మహేష్ నటించడంతో చాలా విమర్శలు వచ్చాయి.
సిమ్రాన్ మహేష్ పక్కన ఆంటీలా ఉంది అని కూడా అప్పట్లో చాలామంది మహేష్ అభిమానులు సైతం కామెంట్ చేశారు. ఇలా ఆ హీరోయిన్ వల్ల మహేష్ బాబుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 2001లో సోనాలి బింద్రే హీరోయిన్ గా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్ కు తొలి భారీ విజయాన్ని అందించింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నాడు. రూపంతోనే కాకకుండా మహేష్ తన నటన, డైలాగ్ డెలవరీతో కూడా అదరగొట్టేస్తాడన్న సంగతి తెలిసిందే. కాగా, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సూపర్హిట్ అవ్వడంతో సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు ఈ సూపర్ స్టార్.