కోలీవుడ్ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ - హీరోయిన్ అమలాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకుని.. నాలుగేళ్లకే విడిపోయారు. పెళ్లికి ముందు వీరిద్దరు ఎంతో కాలం పాటు ప్రేమించుకున్నారు. విజయ్ సినిమాల్లో అమలకు వరుసగా ఛాన్సులు కూడా ఇచ్చారు. ఆ తర్వాత పెళ్లయ్యాక నాలుగేళ్లకే విడిపోయారు. ఆ తర్వాత విజయ్ మరో అమ్మాయిని కూడా పెళ్లి చేసేసుకున్నాడు.
వీరి మధ్య ఏం జరిగిందన్నది ఇప్పటకీ ఎవ్వరికి క్లారిటీ లేదు. ఎంతో అన్యోన్యంగా ఉంటారనుకున్న జంట విడిపోవడం చాలా మందిని షాకింగ్ కు గురి చేసింది. ఇందుకు కారణం అమల, విజయ్ చెప్పలేదు. పెళ్లి తర్వాత కూడా అమల సినిమాల్లో నటిస్తాను అన్నందుకు అత్తింటివారు ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. అయితే అమల, విజయ్ విడిపోవడానికి అసలు కారణం సూపర్స్టార్ రజినీకాంత్ అల్లుడు, సినీ నటుడు ధనుషేనంటూ విజయ్ తండ్రి అళగప్పన్ షాకింగ్ ఆరోపణలు చేశారు.
పెళ్లి తర్వాత తాను సినిమాల్లో నటించ కూడదని ముందుగానే అమల నిర్ణయించుకుంది. అయితే అదే టైంలో ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన వండర్ బార్ ఫిలింస్పై ‘అమ్మ కనక్కు’ అనే సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు. తనతో సన్నిహితంగా ఉండే అమలకు ఈ విషయం చెప్పాడు. ఇక పెళ్లయినా కూడా అమల తప్పనిసరి పరిస్థితుల్లో విజయ్ పక్కన నటించాల్సి వచ్చింది.
ఇదే అమల కాపురంలో కలతలకు కారణమైందట. పెళ్లయ్యాక తాను సినిమాలు చేయనని ముందు చెప్పి ఆ తర్వాత ఇంట్లో వారితో ఒక్కమాటైనా చెప్పకుండా సినిమాకు ఓకే చేయడం విజయ్కు నచ్చలేదు. దీనిపై చాలా రోజుల తర్వాత తాజాగా అమలాపాల్ స్పందించారు. విడాకుల నిర్ణయం తనదే అని.. ఈ విడాకులు ధనుష్ వల్లే అంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని ఆమె చెప్పారు. ధనుష్ తనకు మంచి ఫ్రెండ్ అని, ఇకమీదట తన విడాకులు గురించి మాట్లాడదలుచుకోలేదని వెల్లడించారు.