మహేష్ బాబు.. స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచిన ఈయన ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరూ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ సింహాసనంపై సూపర్ స్టార్ అయ్యారు. ఘట్టమనేని నటవారసుడిగా టాలీవుడ్లో రాజకుమారుడు సినిమాతో అమ్మాయిలకు కలల రాకుమారుడుగా మారాడు. అందం, అభినయం, ప్రయోగాత్మక కథలు, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే స్వభావం, వివాదాలకు ఆమడ దూరంలో ఉండే మిస్టర్ పర్ఫెక్ట్, చెరగని చిరునవ్వు, ఆకట్టుకునే అభినయానికి వరించిన అవార్డులు.. మహేష్ గురించి అడిగితే వచ్చే సమాదానాలు ఇవే. ఇక ఇవన్నీ పక్కన పెడితే మోహన్బాబు హీరోయిన్ మహేష్ బాబుకు వదిన అవుతుంది.
అదెలాగా..? అసలు ఆమె ఎవరు..? ఆవిడకు మహేష్బాబుకు రిలేషన్ ఎలా కలిసింది..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. బి.గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా 1992లో విడుదలైన చిత్రం బ్రహ్మ. ఈ చిత్రం అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలోని ఇప్పటికీ చాలా మంది వింటుంటారు. అయితే ఈ సినిమా ద్వారా శిల్పా శిరోద్కర్ను మోహన్బాబే తెలుగు తెరకు పరిచయం చేసాడు. మరియు ‘ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన’ అంటూ ఆ సినిమాలో మోహన్బాబు పాట పాడేది ఈమె కోసమే. ఆ తరువాత నాగార్జునతో కలిసి హిందీ సినిమా "ఖుదా గవాఃషలో కూడా నటించింది.
అయితే ఈ శిల్పా శిరోద్కర్ ఎవరో కాదు.. మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ కు అక్క. అంటే మహేష్ బాబుకు వదినన్నమాట. బాలీవుడ్లో ‘బ్రష్టాచార్’ సినిమతో కథానాయికగా పరిచయమైన శిల్ప.. ఆ తర్వాత కిషన్ కన్హయ్య.. త్రినేత్ర..హమ్.. ఖుదాగవా.. ఆంఖే.. పెహ్ చాన్.. బేవఫా సనమ్.. మృత్యుదండ్ లాంటి సినిమాల్లో నటించింది. ఇక నమ్రతా శిరోద్కర్కి అక్క, మహేశ్బాబుకి వదిన అయిన శిల్ప... అప్పట్లో తన గ్లామర్తో యువకుల కలల రాణిగా వెలిగారు. అయితే ప్రస్తుతం ఈమెకు అంత క్రేజ్ లేదు. అలాగే ఇప్పుడు శిల్పా శిరోద్కర్ ముంబైయ్లో స్థిరపడింది. ఇక మహేష్ కుటుంబం.. శిల్ప కుటుంబం ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉంటారు.