తెలుగు ఇండస్ట్రీలో ఛలో చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నటి రష్మిక మందన.  మొదటి చిత్రం సూపర్ హిట్ కావడంతో దర్శక, నిర్మాతల చూపు ఈ అమ్మడిపై పడింది.  దాంతో రష్మికకు వరుస ఛాన్సులు రావడం మొదలయ్యాయి.  రెండో చిత్రం పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీతాగోవిందం’ చిత్రంతో మరో బంపర్ హిట్ అందుకుంది.  ఆ తర్వాత దేవదాస్ తో నాని సరసన నటించింది.  కానీ ఈ మూవీ పెద్దగా పేరు మాత్రం తీసుకు రాలేక పోయింది.  గత ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ జెర్సీ. 

 

నాని హీరోగా నటించిన ఈ చిత్రం గత ఏడాది మంచి విజయం అందుకోవడమే కాదు.. అప్పటి వరకు కెరీర్ ఇబ్బందిలో ఉన్న నాని మంచి హిట్ అందుకున్నాడు.  అయితే  మూవీ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఆ చిత్రం సీతారా ఎంటర్టైన్మెంట్ పై నాగవంశీ నిర్మించారు.  ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.  మొదట ఓ బాలీవుడ్ హీరోయిన్ అనకున్నా.. కన్నడ బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్ నే తీసుకున్నారట. అయితే మొదట హీరోయిన్ గా రష్మిక అయితే బావుంటుదని అనుకున్నారు. కానీ అందుకు రష్మిక ఒప్పుకోలేదని టాలీవుడ్ టాక్.

 

గతంలో నాని సరసన నటించిన ఈ అమ్మడు తర్వాత డిమాండ్ బాగా పెరిగిపోవడంతో రెమ్యూనరేషన్ విషయంలో తేడా వచ్చిందని ఫిలిమ్ వర్గాల్లో టాక్.  అంతే కాదు ఆ పాత్ర కూడా తనకు నచ్చకపోవడం వల్లనే రష్మిక రిజక్ట్ చేసిందని.. అంతే కాదు ఓ తల్లిపాత్రలో తాను నటించేందుకు సిద్దంగా లేకపోవడమే ఓ కారణం అని అప్పట్లో న్యూస్ వచ్చాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన రష్మిక అవన్నీ అబద్ధాలే అని కొట్టి పారేసింది. సౌత్ చిత్రాలతో  తీరిక లేకుండా బిజీగా ఉండడం వల్ల  డేట్స్  కుదరలేదని.. అందుకే ఈ చిత్రంలో నటించలేక పోయానని అన్నారు.  ప్రస్తుతం సుకుమార్ - బన్నీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: