టాలీవుడ్ లో మరో హీరో నితిన్ ఒకింటి వాడు కాబోతున్నాడు. ఇటీవల ఎలాంటి హడావుడి లేకుండా షాలినీ అనే అమ్మాయితో నిశ్చితార్ధం కూడా చేసుకున్నాడు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అనుకున్నారు అందరూ. నిన్నా మొన్నటి వరకు ఒకరికి మరొకరు తెలియదు అనుకున్నారు అందరూ. కాని వాళ్ళు ఏడేళ్ళ నుంచి ప్రేమలో ఉన్నారట. కాని ఇప్పటి వరకు ఈ లవ్ స్టొరీ గురించి ఎవరికి తెలియకపోవడం విశేషం. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే నితిన్ రెడ్డి, సమాజంతో సంబంధం లేకుండా హాయిగా ప్రేమించాడు.

 

మీడియాలో గోల లేకుండా, సోషల్ మీడియాలో అల్లరి లేకుండా ఈ ప్రేమను కొనసాగించి పెళ్లి పీటల మీదకు తీసుకొచ్చాడు. ఇంట్లో వాళ్ళను ఒప్పించి ఒక పద్ధతో ప్రకారం ముందుకి వెళ్ళాడు. ఈ మధ్య జరిగిన ఈ నిశ్చితార్ధం కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే నితిన్ కి కాబోయే అత్తగారి ఫ్యామిలీకి మెగా కుటుంబానికి ఒక రిలేషన్ ఉందని అంటున్నారు. నితిన్ కాబోయే అత్తగారు, 2008లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో చేరారు. 

 

ఆ మరుసటి ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యే అభ్యర్ధి గా పోటి చేసారు. ఆమె పేరు నూర్జహాన్... ఇక అప్పటి నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారట. అయితే మెగా కుటుంబంతో మాత్రం వీరికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఒకరి ఇంటి కార్యక్రమాలకు మరొకరు హాజరవుతూ ఉంటారు. నితిన్ కాబోయే మామగారి కి ఉమ్మడి. మహబూబ్ నగర్ జిల్లా లో ప్రగతి హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: