ఆంధ్రప్రదేశ్ లో రాజధాని మార్పు వ్యవహారం ఇప్పుడు సిని పెద్దలకు కూడా ఇబ్బందిగా మారింది. ఇన్నాళ్ళు అమరావతి ఆస్తుల విషయంలో ఏ మాత్రం భయపడని సిని పెద్దలు అక్కడ మరిన్ని భూములు కూడా కొనడానికి సిద్దపడ్డారు. అయితే ఇప్పుడు రాజధానిని మార్చాలని ప్రభుత్వం భావించింది. దీనితో ఒక్కసారిగా వారి భూముల విలువ పడిపోయింది. ఇందులో చాలా మంది టాలివుడ్ ప్రముఖులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. చివరికి హీరోయిన్లు కూడా ఇక్కడ భూములు కొన్నారు. 

 

ఉత్తరాది హీరోయిన్లు కొందరు అమరావతిలో భూములు కొనుగోలు చేయడంతో టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా కొనుగోలు చేసారు. ఇక ఇదిలా ఉంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. పెనుమాక సమీపంలో ఆయన ఆరు ఎకరాలను అప్పుడు ఒక టీడీపీ నేత సలహా తో, పవన్ సహకారం తో కొనుగోలు చేసారట. దీనితో ఇప్పుడు ఆ భూముల విలువ దాదాపుగా పడిపోయింది. ఈ నేపధ్యంలోనే ఆయన జూనియర్ ఎన్టీఆర్ సహకారంతో మంత్రి కొడాలి నానీని కలిసారట. 

 

తనకు అమరావతి ప్రాంతంలో భూములు ఉన్నాయని, వాటిని విక్రయించాలని భావిస్తున్నట్టు చెప్పారట. ఎన్టీఆర్ ఇచ్చిన సలహాతోనే వెళ్లి కొడాలి నానీని త్రివిక్రమ్ కలిసినట్టు సమాచారం. దీనిపై మంత్రి కూడా సానుకూలంగానే సమాధానం చెప్పారట. ఏ ఇబ్బంది ఉండదు అని తాను అండగా ఉంటా అని కొడాలి నానీ హామీ ఇచ్చారట త్రివిక్రమ్. త్వరలోనే వాటికి సంబంధించి తన వంతుగా ఎం చేస్తానో కూడా ఆయన చెప్పినట్టు సమాచారం. దీనితో కాస్త ఊపిరి పీల్చుకున్నారట త్రివిక్రమ్. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు అమరావతి భూముల వ్యవహారం టాలీవుడ్ లో పెద్ద తలనొప్పిగా మారిపోయింది. మరి కొందరు కూడా ఏపీ మంత్రులను కలిసే విధంగా అడుగులు వేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: