టాలీవుడ్ ఏ దర్శకుడికైనా వరుస హిట్స్ పడితే స్టార్ డైరెక్టర్ అని.. కర్మకాలి వరుసగా ఫెయిల్యూర్స్ పడితే డిజాస్టర్ డైరెక్టర్ అని పేరు వస్తుంది. అయితే రాజమౌళి, త్రివిక్రమ్ ఈ మద్య అనీల్ రావిపూడి లాంటి దర్శకులు నిజంగా వరుస విజయాలతో దూసుకు పోతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ ఒక్కటి దెబ్బ పడినా.. కమర్షియల్ హిట్ అందుకుంది. ఇక వరుణ్ సందేశ్, శ్వేతబసు జంటగా ‘కొత్త బంగారు లోకం’ లాంటి రొమాంటిక్ లవ్ స్టోరీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు శ్రీకాంత్ అడ్డాల. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు మల్టీస్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి కుటుంబ తరహా సినిమాతో మరో సంచలన విజయం అందుకున్నాడు.
ఈ సినిమా టేకాఫ్ చూసి మహేష్ బాబు వెంటనే ఈ దర్శకుడికి మరో ఛాన్సు ఇచ్చారు. మహేష్ బాబు, సమంత, కాజల్ జంటగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మరీ బంధుత్వాల గురించి ఎక్కువ చేశారని విమర్శలు వచ్చాయి. అంతే కాదు మహేష్ బాబు లాంటి హీరోతో ఇలాంటి సినిమాలు ఎలా తెరకెక్కించారని దర్శకుడి శ్రీకాంత్ అడ్డాలపై విమర్శలు వచ్చాయి. వరుణ్ తేజ్ తో ముకుంద మూవీతో వచ్చాడు.. ఇది కూడా పెద్దగా కమర్షియల్ హిట్ కాలేకపోయింది. ప్రస్తుతం వెంకటేష్ తో నారప్ప సినిమాను మొదలెట్టాడు.
అయితే ఇంకా ఫామ్ లోకి రాకముందే శ్రీకాంత్ మరోసారి మెగా హీరోతో సినిమా ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ముకుంద లాంటి సినిమాతో వరుణ్ తేజ్ ని ఇంట్రడ్యూస్ చేశారు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమా అనుకున్న విజయం సాధించలేదు. ఇక చాలా కాలం తరువాత శ్రీకాంత్ వరుణ్ కి మరో కథను వినిపించాడట. కథ నచ్చడంతో మెగా హీరో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం వరుణ్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఒక సినిమా చేస్తున్నాడు.