మాలీవుడ్ లో ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయిన సాయి పల్లవి తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఫిదా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవిలో సాయి పల్లవి అచ్చమైన తెలంగాణ యాసతో అందరి మనసు దోచింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తుంది. ఆ మద్య శర్వానంద్ హీరోగా ‘పడి పడి లేచె మనసు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అనుకున్నంత హిట్ మాత్రం కాలేదు. అంతే కాదు ఈ మూవీ సమయంలో నిర్మాత సాయి పల్లవికి రూ.40 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉండగా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇస్తానని చెప్పినట్లు సమాచారం.
అయితే ఈ మూవీ రిలీజ్ కావడం.. ఫెయిల్యూర్ టాక్ వచ్చి నష్టపోవడం జరిగిందట. పడి పడి లేచె మనసు మూవీకి కలెక్షన్లు కూడా దారుణంగా రావడంతో నిర్మాత ఇబ్బందుల్లో పడ్డట్టు సమాచారం. అయితే 'పడి పడి లేచే మనసు' మూవీకి సాయి పల్లవికి 40 లక్ష రూపాయలు ఇవ్వాల్సి ఉందట. సినిమాకి కలెక్షన్స్ రాకపోవడంతో... ఆ నిర్మాత ఇస్తా అన్నా 40 లక్షలను సాయి పల్లవి వద్దనేసిందట. కెరీర్ పరంగా ప్రస్తుతం తాను సంతృప్తిగానే ఉన్నానని.. తనకి డబ్బు కాదు.. ఆత్మసంతృప్తి ముఖ్యమని చెప్పడమే కాదు.. ఎక్కువ సంపాదిస్తే ఏమైనా ఎక్కువ తింటానా.. ఎంత సంపాదించినా రాత్రి ఇంటికి వెళ్లి నేను తినేది మూడు చపాతీలే.. అని తన ఉదారత చాటుకుంటుంది.
ఆ మద్య ఓ యాడ్ కోసం రెండు కోట్ల రెమ్యూనరేషన్ కూడా వదులుకుందట. తన వల్ల ఇతరులు మోస పోవొద్దని.. అందకు తన మనసు ఒప్పుకోదని చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. విలువలు చంపుకుని పని చేయడం అనేది నాకు నచ్చదని చెప్పి హీరోయిన్స్ అందరిలో అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది ఈ పల్లవి.