టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ సినిమా భీష్మ. కన్నడ బ్యూటి రష్మిక మందన నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ లో ఛలో సినిమాతో తనకంటు మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల ఈ సినిమాని తెరకెక్కించాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ భారీగా నిర్మించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఈనెల 21న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్దమైంది. ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీగా నెలకొన్నాయి. 

 

ఇక నితిన్ - రష్మిక జోడీ కి యూత్ బాగానే కనెక్టయ్యారు. ఇక మ్యూజిక్ పరంగా సంగీత దర్శకుడు మహతి సాగర్ అందించిన ట్యూన్స్ కి ఫ్యాన్స్ నుండి మంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక భీష్మలో ప్రతి పాటా దేనికదే వైవిధ్యం అన్నంతగానే తీర్చిదిద్దారు. ఈ శుక్రవారం సింగిల్ ఆంథెమ్ సాంగ్ ని లాంచ్ చేయగా అది జనాలలోకి దూసుకెళ్ళింది. 
అయితే భీష్మ సినిమా విషయంలో నితిన్ కి కాస్త టెన్షన్ మొదలైందట. అందుకు కారణం నితిన్ గత సినిమాలు దారుణంగా పరాజాయాన్ని అందుకున్నాయి. అ..ఆ తర్వాత మళ్ళీ నితిన్ కి హిట్ పడకపోవడంతో భీష్మ సినిమాని కసితో చేశాడు. అయితే ఈ మధ్య టాలీవుడ్ లో వచ్చిన సినిమాలన్ని వరుస బెట్టి ఫ్లాపవుతునాయి. 

 

ఈ మధ్య ఎన్నో అంచనాల మధ్య రిలీజైన జాను డిజాస్టర్ గా మిగిలింది. అంతేకాదు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నలుగురు హీరోయిన్స్ తో కలిసి నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా వరస్ట్ లవర్ అన్న పేరుని తెచ్చుకుంది. అంతే దారుణమైన ఫ్లాప్ అని అర్థం. ఇవన్ని చూసిన నితిన్ కి తన సినిమా భీష్మ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కొద్ది టెన్షన్ పడుతున్నాడట. రిజల్ట్ తేడా కొడితే తర్వాత పరిస్థితేంటి అని ఆలోచిస్తున్నాడట.  ఇంత టెన్షన్ పడుతున్నాడంటే భీష్మ ఫ్లాప్ అని నితిన్ కి అర్థమైపోయిందా ..పాపం మళ్ళీ దెబ్బైపోయిందా ...? అంటూ కామెంట్స్ మొదలైయ్యాయట. మరి రిలీజైతే గాని సంగతేంటో తెలీదు.

మరింత సమాచారం తెలుసుకోండి: