ఇప్పుడు బాలీవుడ్ లో కియారా అద్వాని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. టాలీవుడ్ లో సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించినబ్లాక్ బస్టర్ సినిమా భరత్ అనే నేను. ఈ సినిమాతో కియారా టాలీవుడ్ మంచి క్రేజ్ ని సంపాదించ్జుకుంది. అదిరిపోయో అందం, స్క్రీన్ కి సరిపడా అభినయం తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో మేకర్స్ తో పాటు యంగ్ స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించింది. దాంతో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.

 

సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. దాంతో పాపం కియారా కి భరత్ అనే నేను సినిమాతో వచ్చిన క్రేజ్ ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయింది. దాంతో కొంత మేకర్స్ ఆలోచించారు. ఈ హీరోయిన్ లక్కీ నా అన్ లక్కినా అన్న సందేహాలు మొదలయాయి. అయినా కొంతమంది మేకర్స్ తమ నెక్స్ట్ సినిమాకి కియారా ని తీసుకుందామని ఆలోచనలో ఉన్నారు. ఇంతలోనే కియారా బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోయింది. స్టార్ హీరోల సరసన సినిమా అవకాశాలను దక్కించుకొని డైరీ ఖాలీ లేకుండా నిండిపోయోలా తన అకౌంట్ లో ఆఫర్స్ ని వేసుకుంది.

 

అయితే బాలీవుడ్ లో కియారాకి ఇంతగా పాపులారిటీ రావడానికి కారణం లస్ట్ స్టోరీస్ అన్న హాట్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ తో కియారా బాలీవుడ్ లోటాప్ మేకర్స్ అందరి దృష్ఠిని విపరీతంగా ఆకట్టుకుంది. అడల్ట్ కంటెంట్ తో రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లో మనీషా కోయిరాల, నేహా ధూపియా, రాధికా ఆప్టే వంటి హాట్ బ్యూటీస్ నటించినప్పటికి వాళ్ళందరి కంటే కియారా అద్వానీనే మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ గా ఫేమస్ అయింది. అయితే ఆ సమయంలో కియారా ఆ పాత్ర చేయాలా వద్దా అని ఆలోచించిందట. అలాంటి పాత్ర గనక చేస్తే ఇక తనమీద అదే ముద్ర పడుతుందేమనని కొని రోజులు సతమమయిందట. కానీ నటి అన్నాక అన్ని పాత్రలు చేయాలని ఒప్పుకుందట. ఇక ఆ సీన్స్ షూటింగ్ చేసేటప్పుడు చాలా టెన్షన్ పడ్డప్పటికి వాటి అన్నిటిని ఆపుకోని పాత్రలో ఇన్వాల్వ్ అయి చేసిందట. అయితే అదే పాత్ర కియారా లైఫ్ టర్న్ అయ్యోలా చేసిందిదని గొప్పగా చెబుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: