టాలీవుడ్ లో ఈ జనరేషన్ హీరోల్లో కూడా మంచి రిలేషన్ ఉంది. రీల్ లైఫ్ లో సినిమాలను ఎంత పోటీగా తీసుకుంటారో.. రియల్ లైఫ్ లో స్నేహానికి అంత ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఎన్టీఆర్ ను బన్నీ బావా.. అంటూ రీసెంట్ గా తమ రిలేషన్ ను చెప్పాడు. చరణ్, ప్రభాస్ కూడా ఇలానే ఉంటారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య ఫ్రెండ్ షిప్ ఎంతటితో చూస్తున్నాం. వీరిద్దరితో మహేశ్ కు ఉన్న బాండింగ్ కూడా చూశాం. వీరి బాండింగ్ ఎంత స్ట్రాంగో మహేశ్ మరోసారి రివీల్ చేసి ఫ్యాన్స్ అందరిలో జోష్ నింపాడు.

 

 

బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు మహేశ్. ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో ఓ ముగ్గురితో రైడ్ కు వెళ్లాలంటే ఎవరితో వెళ్తారు అనే ప్రశ్నకు.. రామ్ చరణ్, ఎన్టీఆర్.. వీరిద్దరి తర్వాత చిరంజీవి గారితో మాత్రమే అంటూ వారిద్దరితో తన స్నేహాన్ని, చిరంజీవిపై ఉన్న గౌరవాన్ని ఒకేసారి చెప్పి అందరి అభిమానులను ఖుషీ చేశాడు. భరత్ అనే నేను ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేశ్ - రామ్ చరణ్ - ఎన్టీఆర్ కలిసి సందడి చేశారు. సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే గెస్ట్ గా పిలిచి తాము అందరూ ఎంత స్నేహంగా ఉంటారో చాటి చెప్పాడు.

 

 

మొత్తానికి టాలీవుడ్ న్యూ జనరేషన్ హీరోలందరూ మంచి రిలేషన్స్ మెయిన్ టైన్ చేస్తూ ఫ్యాన్స్ కు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ గెస్చర్ ఎంతో ఆహ్వానించదగినది అనే చెప్పాలి. సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ కూడా ఎంతో స్నేహంగా ఉండేవారు.. ఉంటున్నారు. ఈ జనరేషన్ హీరోలు కూడా ఇదే ర్యాపో మెయింటైన్ చేయడం శుభపరిణామమనే చెప్పాలి. అభిమానులు కూడా అదేవిధంగా ఆలోచిస్తే మంచిదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: