యువ హీరో నితిన్ వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న సినిమా ఛలో. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వంశీ నిర్మించిన ఈ మూవీలో నితిన్ సరసన రష్మిక మందన్న నటించింది. ఈ నెల 21న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఈ ఈవెంట్ మరింత స్పెషల్ గా మారింది. ఇక త్రివిక్రం తో అఆ సినిమా చేసిన నితిన్ అప్పటినుండి ఆయన మీద అభిమానం చూపిస్తూనే ఉన్నాడు.  

 

భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నితిన్ స్పీచ్ హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు. వెంకీ కుడుములతో ఈ సినిమా చేయడం చాలా బాగా ఎంజాయ్ చేశానని. సినిమా బాగా వచ్చింది.. ఈ నెల 21న మీరంతా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారై చెప్పాడు నితిన్. సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ అందరి గురించి ప్రస్థావించిన నితిన్ త్రివిక్రం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన సందర్భం చాలా బాగుందనిపించింది.

 

తన పంచ ప్రాణాల్లో అమ్మా, నాన్న, అక్కతో పాటుగా పవన్, త్రివిక్రం ఉంటారని అన్నాడు నితిన్. అంతేకాదు తన భార్య ఆరో పాణం అవనుందని అన్నాడు. ఈమధ్యనే షాలినితో ఎంగేజ్మెంట్ జరుపుకున్న నితిన్ భీష్మ ఈవెంట్ తన పంచ ప్రాణాల గురించి చెప్పాడు. ఇక పవర్ స్టార్ సినిమా మేలో వస్తుంది.. మనలాంటి ఫ్యాన్స్ అందరం చొక్కాలు చించేసుకుందామని అన్నాడు నితిన్. ఇంతకుముందు తన సినిమా వేడుకల్లో సరిగా మాట్లాడని నితిన్ ఇక్కడ మాట్లాడితే కాని పనులు జరుగవని భావించాడు కాబోలు.. అందుకే భీష్మ ఈవెంట్ లో ఆడియెన్స్ ను ఉర్రూతలూగించేలా మాట్లాడి అదరగొట్టాడు. ఈ మూవీలో తన డ్యాన్స్ ఫ్యాన్స్ ను అలరిస్తుందని.. జానీ, శేఖర్ మాస్టర్ తన బెండు తీశారని అన్నారు నితిన్.

మరింత సమాచారం తెలుసుకోండి: