సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన నటించగా... సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కించారు. 13 ఏళ్ల తర్వాత విజయశాంతి నటించడం కూడా ఈ సినిమాకు ఒక అసెట్ గా మారిపోయింది. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్బస్టర్ హిట్ తో ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ తో కలిసి అమెరికా టూర్  వెళ్లిన విషయం తెలుసిందే. ఇక రెండు నెలలకు పైగా అక్కడ గడిపి ఆ తర్వాత ఇండియా తిరిగొచ్చాక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. 

 

 

 

 ఇదే క్రమంలో మహేష్ బాబు కే జి ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయబోతున్నారు అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్  మహేష్ బాబుకు ఒక స్టోరీ లైన్ చెప్పారని అది మహేష్ బాబుకు  నచ్చడంతో... ఈ కథను నరేట్  చేయడానికి మెగా నిర్మాత గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ వద్దకు కథను పంపారు అంటూ ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తుంది. అవన్నీ కుదిరితే త్వరలోనే ఈ ప్రాజెక్టును కూడా పట్టాలెక్కే  అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం. ఒకవేళ ఇవి అన్నీ కుదిరితే వీరిద్దరి మధ్య భారీ బడ్జెట్ సినిమా రూపొందడం  ఖాయంగా చెప్పవచ్చు. కాగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ 2 చిత్రీకరణలో బిజీబిజీగా ఉన్నాడు. 

 

 

 ఇక ఇంకో విషయం ఏమిటంటే ఎన్నో రోజుల నుంచి రాజమౌళి మహేష్ బాబు  కాంబినేషన్లో సినిమా వస్తుంది అని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్  మూవీ తర్వాత రాజమౌళి మహేష్ సినిమా పట్టా లేక పోతుంది అని తాజాగా టాక్ వినిపిస్తోంది. అయితే రాజమౌళి తన తదుపరి సినిమా కోసం ఇప్పటికే లైన్ సెట్ చేసి పెట్టాడు అని... మహేష్ బాబు ప్రభాస్ కాంబినేషన్లో ఓ సినిమా తీయబోతున్నారు అంటూ ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎలాంటి అఫీషియల్ సమాచారం లేకుండా... వీళ్ల ముగ్గురు పేర్లు మాత్రం ప్రస్తుతం ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎంఎల్  నారాయణ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు అని... టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: