‘కేజీ ఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలి అన్నఆలోచన అందరి టాప్ హీరోలకు ఉన్నట్లుగానే ఎప్పటి నుంచో మహేష్ కు కూడ ఉంది.  దీనికితోడు ప్రశాంత్ నీల్ సైతం తెలుగు స్టార్ హీరోలు స్టార్ ప్రొడ్యూసర్ల నుంచి వచ్చే ఆఫర్ల విషయంలో ఎంతో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. 


ఇప్పటికే ప్రశాంత్ నీల్ తో సినిమాలను చేయడానికి ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ చరణ్ లాంటి స్టార్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్న వార్తలు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ గీతా ఆర్ట్స్ లాంటి సంస్థలు ‘కేజీ ఎఫ్’ దర్శకుడిని వదిలి పెట్టకుండా తమకు ఒక సినిమా చేయమని తమ ఒత్తిడి కొనసాగిస్తూనే ఉన్నారు.


దీనికితోడు ‘కేజీ ఎఫ్’ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమాని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని మైత్రి సంస్థ చాలకాలం క్రితం ప్రకటించింది. అప్పట్లోనే ఎన్టీఆర్ కి ప్రశాంత్ లైన్ వినిపించారని మైత్రి సంస్థ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉందని కూడ లీకులు ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ గా 
మహేష్ కి ప్రశాంత్ నీల్ చెప్పిన కథ నచ్చడంతో ఆకధను వినమని మహేష్ స్వయంగా అల్లు అరవింద్ కు అమెరికా నుండి ఫోన్ చేసి చెప్పాడు అన్న ప్రచారం జరుగుతోంది. గతంలో మహేష్ హీరోగా పరశు రామ్ దర్శకత్వంలో సినిమా చేయాలన్న అరవింద్ చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వార్తలు గతంలో వచ్చాయి.


అయితే ఆమూవీ ప్రాజెక్ట్ విషయంలో మహేష్ అప్పట్లో పెద్దగా ఆసక్తి కనపరచలేదు. అయితే ఇప్పుడు మహేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రశాంత్ నీలు ను అరవింద్ దగ్గరకు పంపడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది. దీనితో ప్రస్తుతం ‘కేజీ ఎఫ్ 2’ చిత్రీకరణలో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ మహేష్ కోసం ఎలాంటి కథను ఎంపికచేసాడు అన్నవార్తల పై భిన్నభిప్రాయాలు వ్యక్తం కావడమే కాకుండా ప్రశాంత్ నీల్ ధాటికి మహేష్ తట్టుకోగలడ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: