యంగ్ హీరో కార్తికేయ నెటిజన్లకు టార్గెట్ అయ్యాడు. ఇందుకు అందాల రాక్షసి లావణ్యనే కారణం. ఈ ఆర్ ఎక్స్ 100 హీరో ఓవర్ ఎగ్జైట్ మెంట్ తో ట్రోల్స్ భారిన పడ్డాడు. కార్తికేయను నెటిజన్లు టార్గెట్ చేసేందుకు లావణ్య త్రిపాఠికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

 

ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ వరుసగా చిత్రాలు చేస్తున్నాడు కానీ.. సక్సెస్ లు మాత్రం దక్కడం లేదు. మధ్యలో నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా కూడా నటించాడు. అయినా సక్సెస్ మాత్రం కనికరించలేదు. ఇలాంటి టైమ్ లో ఆశపడకుండానే కార్తికేయ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నటించే ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ క్రేజీ ఛాన్స్ పై రియాక్ట్ కాకుండా లావణ్య త్రిపాఠిపై రియాక్ట్ కావడమే కాకుండా ఇప్పుడు కార్తికేయపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.


గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో కార్తికేయ హీరోగా చావుకబురు చల్లగా అనే టైటిల్ తో కొత్త సినిమా స్టార్ట్ అయింది. కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన కార్తికేయ ఫస్ట్ లుక్ మాస్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న లావణ్య త్రిపాఠిపై కార్తికేయ చేసిన ట్వీటే ఇపుడు ట్రోల్స్ కు కారణమైంది. 

 

లావణ్య త్రిపాఠితో నటించబోతుండటం సంతోషంగా ఉందంటూ.. ఆమెకు అభిమానిగా మారిపోయానంటూ ట్వీట్ చేశాడు. ఈ యంగ్ హీరో అంతటితో ఆగకుండా ఆమెతో నటిస్తుండటం గొప్ప అచీవ్ మెంట్ అన్నాడు. ఇందుకు లావణ్య సో స్వీట్ థ్యాంక్యూ .. ఈ సినిమాతో నువ్వు కుమ్మేయడం ఖాయమంటూ రిప్లై ఇచ్చింది. నెటిజన్లు మాత్రం సమంత, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్స్ తో నటించడం అచీవ్ మెంట్. అంతేకానీ హీరోయిన్ గా సక్సెస్ కాని లావణ్యతో నటించడం గొప్పేంటని కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: