హిందీలో `లస్ట్ స్టోరీస్` వెబ్ సిరీస్తో కియారా అద్వానీ సంచలనం సృష్టించింది. ఈ సిరీస్ సూపర్ పాపులర్ కావడంతో అక్కడ నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోవడం లేదు. వరుసగా వచ్చి పడుతోన్న అవకాశాలతో ఆమె రేటు కొండెక్కించేసింది. ఆమె క్రేజ్ చూసిన తర్వాత ఆమెతో సినిమాలు నిర్మించాలని బాలీవుడ్తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు.
ఇక తెలుగులో ఇప్పటికే కియారా మహేష్ నటించిన `భరత్ అనే నేను` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కియారా అద్వానీ. ఈ సినిమా సూపర్హిట్ కావడంతో వెంటనే తెలుగులో రామ్చరణ్ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన వినయ విధేయ రామ సినిమాలో రామ్చరణ్కు జోడీగా నటించింది. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్లీ ఆమెకు తెలుగులో ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వలేదు.
ఇక కియారా కు తాజాగా తెలుగులో అదిరిపోయే ఆఫర్ లభించింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరపైకి రాబోతోంది. ఈ సినిమాలో నటించేందుకు చిత్ర దర్శక నిర్మాతలు కియారాను సంప్రదించారట. రెండు కోట్లు పారితోషికం అయితేనే చేస్తానని కియారా కరాఖండీగా చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడే ఆమె కండీషన్లు కూడా పెట్టినట్టు టాక్..? ఈ కండీషన్లు చూసి అందరూ షాక్ అవుతున్నారు.
నేను అడిగినంత ఇస్తేనే తాను ఓవర్ ఎక్స్పోజింగ్కు అయినా రెడీ అన్న సంకేతాలు పంపినట్టు టాక్..? ఇప్పుడు ఇదే మ్యాటర్ ఇండస్ట్రీ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. ఏదేమైనా అర్జున్రెడ్డి బాలీవుడ్ రీమేక్ `కబీర్సింగ్` బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కియారా క్రేజ్ పెరిగిపోయింది. ఆ సినిమాతో కియారా క్రేజ్ బాలీవుడ్ కో, టాలీవుడ్కో పరిమితం కాలేదు.. ఒక్కసారిగా ఆమె నేషనల్ క్రేజీ హీరోయిన్ అయిపోయింది. దాంతో తన క్రేజ్కి తగ్గట్టే రెమ్యునరేషన్ని కియారా డిమాండ్ చేస్తోంది.