మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అటు హీరోగానూ.. ఇటు నిర్మాతగానూ అటు బిజినెస్మెన్ దూసుకుపోతున్నాడు. రంగస్థలం సినిమాకు ముందు వరకు అంతంత మాత్రంగానే ఉన్నా రామ్ చరణ్ క్రేజ్ ఆ సినిమా తర్వాత ఇప్పుడు స్కే రేంజ్ కు చేరిపోయింది. రంగస్థలం తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాసింది. ఇక కొణిదల బ్యానర్ స్థాపించిన రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిని హీరోగా పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఈ బ్యానర్ లో వేరే హీరోలతో సినిమాలు చేస్తారా ? అన్న సందేహాలు నిన్నమొన్నటి వరకు ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఇదే బ్యానర్లో మరో సీనియర్ హీరోతో చెర్రీ మల్టీస్టారర్కు రెడీ అవుతున్నట్టు టాక్. ఇప్పటికే ఈ బ్యానర్ పై తన తండ్రి చిరంజీవి హీరోగా ఖైదీ నెంబర్ వన్ 150 సినిమా తో పాటు సైరా నరసింహారెడ్డి కూడా నిర్మించారు. ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిరంజీవి 152వ సినిమా సైతం ఇదే బ్యానర్లో తెరకెక్కుతోంది.
రామ్చరణ్ ఇప్పటికే మలయాళం నుంచి `లూసీఫర్`...`డ్రైవింగ్ లైసెన్స్` చిత్రాల రీమేక్ రైట్స్ ని చరణ్ ఇప్పటికే దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లలో హీరోలుగా ఎవరు ? నటిస్తారు ? అన్నది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇప్పటి వరకు చిరుతోనే సినిమాలు తీస్తోన్న ఈ బ్యానర్లో తొలిసారిగా వెంకీ నటిస్తాడన్న గుసగుసలు మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్నాయి.
ఇక తన బ్యానర్లో తొలిసారిగా బయట హీరోతో తీసే సినిమాకు హీరోగా చరణ్ సీనియర్ హీరో, తన తండ్రి చిరంజీవికి సమకాలికుడైన విక్టరీ వెంకటేష్ హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తొలి సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. మరి దీనిపై చెర్రీ ఎప్పటకీ క్లారిటీ ఇస్తాడో ? చూడాలి.