టాలీవుడ్ లోకి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగాన నటించిన ‘ఏం మాయ చేసావే’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మాలీవుడ్ బ్యూటీ సమంత.   ఈ సినిమాతో పరిచయం అయిన అక్కినేని నాగ చైతన్యను రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది. టాలీవుడ్ లో సమంత నటించిన సినిమాలు వరుస విజయాలు అందుకోవడంతో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.  రెండు భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది.  రేండేళ్ల క్రితం నాగ చైతన్యతో వివాహం జరిగిన తర్వాత సమంత ఇక సినిమాల్లో నటించదు అన్న వార్తలు వచ్చాయి.  కానీ అందరికీ ట్విస్ట్ ఇస్తూ పెళ్లైన తర్వాతే ఈ అమ్మడు వరుస విజయాలతో దూసుకు పోతుంది.  


ఇక సమంత ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగి పోతుందని పలు మార్లు నిరూపించింది.  ఆ మద్య రంగస్థలం సినిమాలో ఓ పల్లెటూరి అమ్మాయిగా నటించి మెప్పించింది.  ఓ బేబీ సినిమాలో 80 ఏళ్ల మహిళ మనస్తత్వం ఎలా ఉంటుందో నటించింది.  ఇలా ఎప్పటికప్పుడు తన నటన విషయంలో ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా సమంత జానుతో మరో మెట్టు ఎక్కారని విమర్శకులు సైతం ప్రశంసించారు. తాజాాగా సమంతో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

తన భర్త నాగచైతన్యకు సినిమాల ఎంపికలో తాను ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వబోనని స్పష్టం చేశారు. చైతూ సినిమాల విషయంలో ఎంతమాత్రం తాను జోక్యం చేసుకోనని వెల్లడించారు. చాలా మంది స్క్రిప్ట్ విషయంలో ఎంతో అద్భుతంగా చెప్పినా.. తెరకెక్కించే విషయలో తప్పులు చేస్తుంటారు.  నా విషయంలో నేను చాలా లక్కీ. నేను స్క్రిప్టులో ఏం ఊహించుకున్నానో నా డైరెక్టర్లు అదే తెరకెక్కించారు.  అందుకే నా సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంటున్నాని అన్నారు.  ఏది ఏమైనా సమంత మంచి అదృష్టవంతురాలని అంటున్నారు ఫ్యాన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: