టాలీవుడ్ సినిమా పరిశ్రమకు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా ద్వారా నటిగా పరిచయం అయింది కియారా అద్వానీ . అంతక ముందు ఎమ్ ఎస్ ధోని అనే సినిమా ద్వారా బాలీవుడ్ లో మంచి పేరు సంపాదించిన కియారాను చూసిన టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ, ఆమెను మహేష్ ప్రక్కన తాను తీయబోయే సినిమాలో తీసుకుంటే బాగుంటుందని భావించి భరత్ అనే నేనులో తీసుకోవడం, రిలీజ్ తరువాత ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో ఆమెకు మంచి పేరు రావడం జరిగింది. 

 

అది మాత్రమే కాక ఆ సినిమాలో కియారా తన అందం, అభినయంతో ప్రేక్షకుల దృష్టిని కూడా తన వైపునకు త్రిప్పుకుంది. ఇక ఆ తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది కియారా. అయితే అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా బోల్తా కొట్టడంతో కియారా ఆపై బాలీవుడ్ కె పరిమితం అయింది. దాని అనంతరం అక్కడ లస్ట్ స్టోరీస్ అనే బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించిన కియారా, ఆ తరువాత తెలుగు అర్జున్ రెడ్డికి బాలీవుడ్ రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ లో హీరోయిన్ గా నటించడం, ఆ సినిమా అనూహ్యంగా అక్కడ పెద్ద విజయాన్ని అందుకొవడంతో మన దర్శకుల దృష్టి మళ్ళి ఆమెపై పడింది. అతి త్వరలో మహేష్ తో వంశీ పైడిపల్లి చేయబోయే సినిమాలో ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేసారు అనే వార్తలు ఇప్పటికే పలు టాలీవుడ్ వర్గాల్లో హల చల్ చేస్తున్నాయి. 

 

ఇక ఆ విషయం అటుంచితే, ఎక్కువగా పొందికగా డ్రెస్ చేసుకుని తన అందంతో ఫ్యాన్స్ ని ఆకట్టుకునే కియారా, నేడు ఒక్కసారిగా ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబ్బు రత్నాని తీసిన లేటెస్ట్ ఫోటో షూట్ లో ఏకంగా నగ్నంగా ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక ఆ ఫొటోలో ఆమె ప్రైవేట్ పార్ట్స్ కు ఆకులు అడ్డంగా పెట్టి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు. ఇక ఆ ఫోటోలపై కొందరు నెటిజన్లు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నిజంగా నీకు సిగ్గు లేదు, ఛ, అవకాశాల కోసం ఇలా నగ్నంగా ఫోటోలకు ఫోజులివాలా అంటూ కొందరు ఆమె ఫోటోలపై పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: