కాంట్రవర్సీ కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ. ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ లేకపోతే సినిమాలు తెరకెక్కిస్తోంది నిత్యం వార్తల్లో ఉంటారు రామ్ గోపాల్ వర్మ. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అదేవిధంగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఇలా అనేక రకాల సినిమాలు తీసి సెన్సేషనల్ క్రియేట్ చేశారు. ఇటువంటి తరుణంలో తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన దిశ అత్యాచారం హత్య ఘటన కథ ఆధారంగా సినిమా తెరకెక్కించాలని రాంగోపాల్ వర్మ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి స్టోరీ విషయంలో ఫుల్ క్లారిటీ తో ఉన్న రాంగోపాల్ వర్మ దిశను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్యతో రామ్ గోపాల్ వర్మ మాట్లాడటం జరిగింది.

 

ఆమెకు సాయం కూడా ఆర్థికంగా చేశారు రాంగోపాల్ వర్మ. ఇదే సందర్భంలో ఈ హత్య ఘటనను టేకప్ చేసిన తెలంగాణ శంషాబాద్ పోలీసులను ముఖ్యంగా ఎసిపి ని రామ్ గోపాల్ వర్మ ఇటీవల కేసు వివరాలను అడిగి తెలుసుకోవటం జరిగింది. దీంతో మొత్తం అంతా గ్యాదర్ చేసిన రామ్ గోపాల్ వర్మ స్క్రిప్ట్ మొత్తం పక్కాగా రెడీ చేశారు. ఇటీవల శంషాబాద్ పోలీసులతో చర్చించిన సందర్భంలో అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా తీసేందుకు దిశా తల్లిదండ్రుల అనుమతి పొందారా ? అని అడిగితె .. తనకు ఎవరి పర్మిషన్ తీసుకోవలసిన అవసరం లేదని అన్నాడు వర్మ.

 

ప్రస్తుతం ఎసిపి ని కలిశానని త్వరలో మరి కొంతమంది ని కలవబోతున్నట్లు రాంగోపాల్ వర్మ ఆ సందర్భంలో తెలిపారు. ఇటువంటి నేపథ్యంలో నలుగురు నిందితుల లో చెన్నకేశవల భార్య ను కలిసిన ఆర్జివి...మిగతా ముగ్గురు దోషులు ఇళ్లకు కూడా రాంగోపాల్ వర్మ వెళ్ళటానికి రెడీ అవుతున్నారట. అయితే ఈ వార్త ఆ ముగ్గురు ఇంటికి చెందిన కుటుంబాలకు తెలియడంతో...ఇప్పటికే వాళ్ల కొడుకులు చేసిన పనికి పూర్తిగా తల ఎత్తుకునే పరిస్థితి లేకపోవడంతో...రామ్ గోపాల్ వర్మ స్వయంగా ఇంటికి వచ్చిన తలుపులు తీసే పరిస్థితి ఆ ముగ్గురు దోషుల కుటుంబాల ఇంటి వద్ద లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: