చలో  సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన హీరోయిన్ రష్మిక మందన్న. ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది రష్మిక మందన. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ కు జోడీగా నటించిన గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని రష్మిక స్టార్ హీరోయిన్ ఇమేజ్ కి బాటలు వేసింది. ఇక కెరీర్ మొదటి నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటు... నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ వచ్చింది రష్మిక మందన. ఇక మొన్నటికి మొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన చాన్స్ కొట్టేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది రష్మిక మందన్న. 

 

 ఇక సూపర్ మహేష్ బాబు సరసన నటించిన సినిమా సంచలన విజయం  సాధించడంతో  ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చేసింది.ఇంకేముంది వరుస సినిమా అవకాశాలను  దక్కించుకుంటూ బిజీబిజీగా ఉంది. ప్రస్తుతం స్టార్ హీరోలందరి సరసన చాన్స్ కొట్టేసింది రష్మిక మందన. ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న భీష్మ సినిమాలో నితిన్ సరసన నటించింది టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన.ఈ  సినిమాలో  నటనతో పాటు డాన్సులు  కూడా ఇరగదీశాను  అని చెబుతోంది ఈ అమ్మడు . కాగా  ఈ సినిమా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


 ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది చిత్ర బృందం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ చిత్రంలోని దర్శనమిస్తోంది. కాగా ఫిబ్రవరి లో విడుదలవుతున్న సినిమాల్లో నితిన్ హీరోగా నటించిన భీష్మ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎంతగానో బజ్ ఏర్పడింది. అంతే కాకుండా ఈ మధ్య కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను  ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.కాగా  ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కూడా ఆ కోవకు చెందిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నితిన్.. రష్మిక ఓ ఇంటర్వ్యూకు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా రష్మిక మందన్న గురించి నితిన్ ఓ సంచలన నిజాన్ని బయటపెట్టారు. రష్మిక మందన కుక్క బిస్కెట్లు తింటుంది అంటూ నిజాన్ని బయటపెట్టాడు. రష్మిక వద్దు వద్దు అని ఎంత చెబుతున్నా వినకుండా నిజాన్ని బయట పెట్టేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: