ఏది ఎలా ఉన్నా సరే టాలీవుడ్ హీరోలు పిరికి వాళ్ళు. ఈ మాట చెప్తే చాలా మందికి ఇష్టం ఉండదు గాని అది అక్షరాలా నిజ౦. బాలీవుడ్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ ఏ ప్రయోగానికి అయినా సిద్దంగా ఉంటే మన టాలీవుడ్ హీరోలు మాత్రం భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒక్కో హీరో ఇప్పుడు జాగ్రత్త గా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు గాని సాహసం చేసి ఒక్క సినిమా కూడా చేయడం లేదు హీరోలు. ఇటీవల ఒక బాలీవుడ్ దర్శకుడు ఒక ప్రముఖ హీరోతో సినిమా చేసేందుకు ప్లాన్ చేసాడు. 

 

సినిమా లో ఒక గూడచారి గా సదరు స్టార్ హీరో చెయ్యాలి. అది పాకిస్తాన్ కథ నేపధ్యంలో ఉంటుంది. ఆ దర్శకుడు కూడా స్టార్ దర్శకుడే. కాని సదరు హీరో మాత్రం తాను సినిమాలు అలా చేయలేను అని తనకు ఉన్న స్టార్ ఇమేజ్ కి ఆ సినిమా సెట్ అవ్వదు అని చెప్పాడట. వెంటనే ఆ కథ ను తమిళ హీరో వద్దకు తీసుకువెళ్లగా అందుకు సదరు దర్శకుడు ఒకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాను త్వరలో సెట్స్ పైకి తీసుకువెళ్ళే ఆలోచన చేస్తున్నారు. 

 

సినిమా కు భారీగా ఖర్చు అవుతుంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ను విడుదల కూడా చేయనున్నారు. ఇక దానితో పాటుగా మరో సినిమాను కూడా ఒక స్టార్ హీరో వద్దని చెప్పినట్టు సమాచారం. సుకుమార్ ఒక స్టార్ హీరో వద్దకు వెళ్లి కథ వినిపించగా అందుకు ఆ హీరో భయపడినట్టు తెలుస్తుంది. ఆ కథను వేరే దర్శకుడికి ఇచ్చేసాడు సుక్కు అంటున్నారు. ఇక స్టార్ హీరోలు కూడా ఇప్పుడు సేఫ్ జోన్ లోనే సినిమాలు చెయ్యాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: