‘జాను’ మూవీ ఫెయిల్యూర్ అయినా తిరిగి మళ్ళీ సమంత తోనే నటించాలని చేసిన ప్రయత్నాలకు సమంత చాల తెలివిగా తప్పించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన కథ ‘మహాసముద్రం’ శర్వానంద్ కు విపరీతంగా నచ్చడంతో ఆ మూవీలో సమంత నటిస్తే తాను కూడ నటిస్తాను అని కండిషన్ పెట్టినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.


దీనితో అజయ్ భూపతి సమంత చుట్టూ తన మూవీలో నటించమని కోరుతూ అతడి ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. దీనితో సమంత తెలివిగా ‘మహాసముద్రం’ మూవీలో హీరోయిన్ పాత్రకు తాను సరిపోనని ఆ పాత్ర స్వభావం రీత్యా ఆ పాత్రకు అన్నివిధాల అదితి రావ్ సరిపోతుందని చెప్పి ఒప్పించడమే కాకుండా ఈ విషయంలో శర్వానంద్ తో రాయబారాలు చేసి ‘మహాసముద్రం’ మూవీ ప్రాజెక్ట్ కు శర్వా అదితి రావ్ ల కాంబినేషన్ సెట్ చేసినట్లు సమాచారం.


ఇప్పుడు ఈ కాంబినేషన్ కు ఓకె చేయడంతో ‘మహాసముద్రం’ సినిమా ప్రారంభం అవ్వడానికి రంగం క్లియర్ అయింది. వాస్తవానికి అజయ్ భూపతి ఈ మూవీలోని హీరోయిన్ హీరో పాత్రలను నాగచైతన్య సమంత లను దృష్టిలో పెట్టుకుని వ్రాసాడు. అయితే ఆ కాంబినేషన్ సెట్ అవ్వక పోవడంతో మధ్యలో రవితేజ చుట్టూ తిరిగి చివరకు శర్వానంద్ దగ్గర ఫైనల్ అయింది.


దీనితో ఈ యంగ్ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫైనల్ అయినప్పటికీ సక్సస్ ఫుల్ హీరోయిన్ సమంత చేస్తుంది అనుకున్న మూవీలో అదితి రావ్ ఏమిటి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి అదితి రావ్ కు మంచి నటిగా పేరు ఉన్నా ఆమె నటించిన సినిమాలు తెలుగులో ఏమాత్రం విజయం సాధించలేదు. దీనితో సమంత ‘జాను’ ఫలితంతో మళ్ళీ శర్వానంద్ తో నటించడం ఇష్టం లేక ఇలా తప్పుకుందా లేకుంటే నిజంగానే తాను ‘మహాసముద్రం’ మూవీలోని పాత్రకు సరిపోనని ఈనిర్ణయం తీసుకుందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: