ఏలాంటి సన్నివేశాలు అయినా.. ఆ ఫిలింసిటీలో తీసెయ్యచ్చు.. ప్రేమలు పండించాలన్న.. యాక్షన్ చెయ్యాలన్న.. మర్డర్ చెయ్యాలన్న.. ఆ సెట్ కి మించినది మరొకటి ఉండదు. ఇక ఈ నేపథ్యంలోనే మాస్ గా.. యాక్షన్ సీన్స్ చేస్తూ రామోజీ ఫిలింసిటీని ఆ స్టార్ హీరోలు అల్లడిస్తున్నారు.
వారు ఎవరు అనుకుంటున్నారా? ఫోటో చూశారుగా ఆ హీరోలే.. ఇటీవలే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన మన్మధుడు చిత్రం అట్టర్ ప్లాప్ అయినా సంగతి తెలిసిందే.. అందుకే నాగార్జున కూడా యాక్షన్ సీన్స్ తియ్యాలని నిర్ణయించుకొని ఫిలింసిటీలో ఇరగదీస్తున్నాడు.. నాగార్జున ఎన్.ఐ.ఎ అధికారిగా నటిస్తున్న 'వైల్డ్ డాగ్' సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో ఏకంగా ఇల్లు సెట్ వేశారు.
ఇంకా విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తి, జయం రవి, త్రిష, ప్రభు, అదితి రావ్ హైదరీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చారిత్రక నేపథ్య చిత్రం అయినా పొన్నియన్ సెల్వన్ సినిమాను మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ తమిళ చిత్రం కు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. ఈ సినిమా మొదటి భాగం 2021లో విడుదల కానుంది.
ఇక తలైవా.. రజినీకాంత్.. దర్బార్ సినిమా తర్వాత మరో యాక్షన్ సినిమా రెడీ చేస్తున్నాడు. రజిని 168వ సినిమా ఇది.. ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో పబ్ సెట్నుచిత్రీకరించారు. ఈ సినిమాలో రజినీకాంత్ మూడు పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం అందాల తారలు అయినా కీర్తి సురేష్, మీనా, ఖుష్బు హీరోయిన్లగా నటిస్తున్నారు.