భిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తన విలక్షణమైన నటనతో మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నారు హీరో నితిన్. ఇక తాజాగా నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ఈ నెల 21న శివరాత్రి రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు ఇప్పటికే మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడా ఎంతగానో ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన నితిన్ జోడి బాగా సెట్ అయింది అని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బజ్  ఏర్పడింది. 

 

 అంతేకాకుండా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు ఈ మధ్య మంచి విజయాలు సాధిస్తుండడం తో ఈ సినిమా పై మరింత భరోసాతో ఉన్నాడు నితిన్.ఇక చలో  లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ ఈరోజుల్లో సినిమాలపై వివాదాలు చుట్టుముట్టడం  కామన్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు భీష్మ సినిమా కి కూడా వివాదాలు బెడద  ముంచుకొస్తోంది. ఈ సినిమాను ఎలాగైనా విడుదల కాకుండా అడ్డుకుంటామని బీజేపీ ధార్మిక సెల్ డిమాండ్ చేసింది. 

 

 అయితే భీష్మ సినిమాకు సంబంధించిన ట్రైలర్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 21న ఈ సినిమా  800 స్క్రీన్లలో  విడుదల కానుంది. అన్నీ సవ్యంగా సాగిపోతున్న సమయంలో భీష్మ సినిమాకు ఓ వివాదం చుట్టుముట్టింది. ఇంతకీ ఈ సినిమాకు వివాదం ఎందుకు చుట్టుముట్టింది అంటే.. దానికి కారణం ఈ సినిమా టైటిల్. మహాభారతంలో భీష్ముడు పేరును  సినిమా టైటిల్  గా పెట్టడంతో అసలు తల నొప్పులు మొదలయ్యాయి. దీంతో భీష్మ టైటిల్తో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి బిజెపి ధార్మిక సెల్  ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే టైటిల్ మార్చాలని లేదంటే సినిమా విడుదలను అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ విషయంపై బీజేపీ దార్మిక సెల్ కన్వీనర్ తూములూరు శ్రీ కృష్ణ చైతన్య,  ప్రధాన కార్యదర్శి రత్నాకరం రాము... సినిమా టైటిల్ మార్చాలని అంటూ చిత్ర బృందాన్ని డిమాండ్ చేశారు. వచిత్రబంధం దీనిపై ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: