టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ భీష్మ సినిమాతో ఫిబ్రవరి 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సారి భీష్మ సినిమాతో నితిన్ హిట్ కొట్టేలానే కసిగా ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కి నితిన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో చిత్ర బృందానికి ఈ సినిమాపై నమ్మకం విపరీతంగా పెరుగుతోంది. ఇదిలా ఉంటే నితిన్ తర్వాతి సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన అంధాధున్ సినిమాని మన నితిన్ రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

అయితే ప్రస్తుతం నితిన్ కూడా ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు. ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ సినిమా తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ నుండి తాజాగా అందిన సమాచారం. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకొని ప్రేక్షకుల తో పాటు విమర్శకులని మెప్పించిన దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా రీమేక్ పై క్లారిటీ వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో నితిన్ కి కొన్ని వింత ప్రశ్నలు ఎదురవుతున్నాయట.

 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రీమేక్ సినిమాలంటే ఎవరూ ముందుకు రావడం లేదట. రీమేక్ చేస్తున్నారని తెలియగానే ఆ సినిమాని అదే భాషలో చూసేస్తున్నారు. అంతేకాదు రీమేక్ చేసిన సినిమాలకి కలెక్షన్లు కూడా పెద్దగా రావడం లేదు. జాను సినిమాతో ఈ విషయం అందరికీ చాలా క్లియర్ గా అర్థమైంది. తమిళంలో సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్లు వసూలు చేసిన 96 సినిమాని తెలుగులో జాను పేరుతో రీమేక్ చేస్తే కనీస వసూళ్ళు కూడా రాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు కి సమంత, శర్వానంద్ లకి బాగా మైనస్ అయింది. 

 

క్లాసిక్ హిట్స్ గా నిలిచిన సినిమాలని రీమేక్ చేస్తే జనాలు ఎలా రియాక్ట్ అవుతారో అర్థమైపోయింది. థ్రిల్లర్ జోనర్ లో అంధాధున్ కూడా ఒక క్లాసిక్ సినిమానే. మరి ఈ సినిమాని రీమేక్ చేసి నష్టపోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారట చాలామంది. ఇక త్వరలో పెళ్ళి పెట్టుకొని ఇలాంటి రిస్కీ పనులు ఎందుకని ఒకవేళ సినిమా గనక అనుకున్నంతగా ఆడకపోతే నీ భార్య కూడా ఫీలవుతుంది కదా .. మా ఆయన సినిమా ఫ్లాప్ అయిందని ..ఎందుకు లాంటి పనులు ఈ సమయంలో చేయడం అని నితిన్ సన్నిహితులు సన్నిహితులు చెబుతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: